హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రైళ్లు, స్టేషన్లలో ప్రదర్శిస్తున్న బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే ప్రకటనలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది.
కెపిహెచ్బి కాలనీకి చెందిన న్యాయవాది ఎన్ నాగూర్ బాబు, అటువంటి ప్రకటనలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి చర్యల కారణంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ల కార్యకలాపాలను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు.
ఈ పిటిషన్లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, పౌర అధికారులు, పోలీసు అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో వారు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఒప్పందాలపై ఈడి, సిబిఐ దర్యాప్తు చేయాలి
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్,ఫెయిర్ప్లే, 1xBAT, MyJackpot777 వంటి ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు,ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ని ఆదేశించాలని బాబు కోర్టును అభ్యర్థించారు. ఈ ప్లాట్ఫామ్లలో చాలా వరకు భారతదేశంలో పనిచేయడానికి అనుమతి లేకుండా విదేశాల నుండి పనిచేస్తున్నాయని బాబు తన పిటిషన్లో హైలైట్ చేశారు.
అక్రమ బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్న HMR: PIL
బెట్టింగ్ యాప్ల ప్రకటనలను అనుమతించడం ద్వారా…హైదరాబాద్ మెట్రో రైలు యాదృశ్చికంగా అనుమానం లేని వ్యక్తులను అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తోందని ఆయన వాదించారు.
అటువంటి ప్లాట్ఫామ్లపై కొనసాగుతున్న ED దర్యాప్తులను ఆయన ఉదహరించారు, దీని వలన అక్రమ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న సుమారు రూ. 399 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు అవసరమని న్యాయవాది నొక్కిచెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తుకు ఆదేశించాలని కోర్టును కోరారు.