Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పార్లమెంటుకు గైర్హాజరైన అమిత్‌ షా…విమర్శించిన ఖర్గే !

న్యూఢిల్లీ: విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై పార్లమెంటులో ప్రకటన చేయనందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించాలని రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సూచించినప్పటికీ ఆయన సభకు హాజరు కాలేదని ఖర్గే అన్నారు. ఈమేరకు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా ఇద్దరూ పార్లమెంటును ‘విస్మరిస్తున్నారని’, ఉభయ సభలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన నిరసనల […]
Read more

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు… బిల్లును ఆమోదించిన లోక్‌సభ!

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా జరిగే చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, ఇతర సేవా ప్రదాతలకు ప్రభుత్వానికి అధికారం కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. సభలో గందరగోళం నడుమ చర్చ లేకుండా ఆమోదం పొందిన ఈ సవరణ, నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయకుండా బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలను నిరోధించే ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించాలని కోరుతోంది. డిజిటల్ […]
Read more

గత ఐదేళ్లలో సీఆర్పీఎఫ్‌లో అత్యధిక ఆత్మహత్యలు!

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో గత ఏడాది 59 ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళల్లో ఇదే అత్యధికమని గణాంకాలు వెల్లడించాయి. చనిపోయిన వారిలో 80 శాతానికి పైగా కానిస్టేబుళ్ల సిబ్బందే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2021-25 మధ్య కాలానికి సంబంధించిన అధికారిక డేటాను ఉటంకిస్తూ, మొత్తం 262 కేసులలో 202 కేసులు సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా సంభవించాయని, మిగిలినవి వారు సెలవులో ఉన్నప్పుడు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై […]
Read more

పోలీసులు మమ్మల్ని కొట్టారు…రాహుల్‌తో పాటు మీడియాతో మాట్లాడిన జెన్ జెడ్ తరం!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల క్రూరత్వంపై, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యువ నిరసనకారుల వెనుక నిశ్శబ్దంగా నిలబడి, వారి మాటలను శ్రద్ధగా వింటూ, భరోసా ఇస్తూ నవ్వుతూ, వారిని నిరంతరాయంగా మాట్లాడనిస్తూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రెండు వారాల లోపే ఇది ఆయనకు రెండోసారి. జూలై 25న, రాహుల్‌ గాంధీ తన పక్కన ఐసా (AISA) అధ్యక్షురాలు నేహా బోరా, ఇతర విద్యార్థి కార్యకర్తలతో కలిసి […]
Read more

మదర్సాలు ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపిస్తే ‘ఆకాశం ఊడిపడదు’…కలకత్తా హైకోర్టు!

కోల్‌కత: మదర్సాలలో వందేమాతరంలోని ఆరు చరణాలనూ పాడితే “ఆకాశం కూలిపోదని కలకత్తా హైకోర్టు మంగళవారం మౌఖికంగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని, రాష్ట్ర గుర్తింపు పొందిన మదర్సాలలో ఈ పద్ధతిని తప్పనిసరి చేస్తూ మే 19న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తపబ్రత చక్రవర్తి, జస్టిస్ పార్థ సారథి సేన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ల […]
Read more

గోపూజను వ్యతిరేకించిన సావర్కర్!

పూణే: వినాయక్ దామోదర్ సావర్కర్ ఆవును దేవతగా కాకుండా ఉపయోగకరమైన జంతువుగా భావించాడని అతని మనవడు సత్యకి సావర్కర్ పూణేలోని ప్రత్యేక కోర్టుకు తెలిపారు. కొనసాగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవార్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో లండన్‌లో చేసిన ప్రసంగంలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ముస్లిం వ్యక్తిపై దాడి చేయడం గురించి […]
Read more

మోదీ, అమిత్‌షా ‘పార్లమెంటును అవమానిస్తున్నారు…ఆరోపించిన ఖర్గే!

న్యూఢిల్లీ: రామమందిర విరాళాల చోరీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంటును అవమానిస్తున్నారని, లేదంటే భయపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పార్లమెంటు ఉభయ సభలలోనూ ఈ రెండు అంశాలపై చర్చ జరగాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలలో ప్రతిపక్ష సభ్యులు […]
Read more

అనురాగ్ ఠాకూర్ ‘గోలీ మారో’ కేసులో బృందా కారత్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం 2020లో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల సమయంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ‘గోలీ మారో’ ప్రసంగంపై ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరిస్తూ ఏప్రిల్ 29న ఇచ్చిన తన తీర్పును పునఃసమీక్షించడానికి నిరాకరిస్తూ, సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కారత్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం, తన ఉత్తర్వులో, పునఃసమీక్షించాల్సినంత స్పష్టమైన లోపం ఏదీ మునుపటి తీర్పులో లేదని పేర్కొంది. […]
Read more

ఈ20 పెట్రోల్‌పై ప్రజాగ్రహం పెరుగుతోంది… కాంగ్రెస్!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌ను విడుదల చేయడంపై రాజకీయ పోరు తీవ్రమైంది. ఈ ఇంధన మిశ్రమం వాహనాలపై చూపే ప్రభావం గురించి వినియోగదారులలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ20 పెట్రోల్‌కు మారడంపై ప్రజాగ్రహం పెరుగుతోందని, దాని దీర్ఘకాలిక ప్రభావాలపై జవాబుదారీతనం, పారదర్శకత, కచ్చితమైన సమాచారం కావాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. ఆందోళనలను కొట్టిపారేయడానికి సమగ్రమైన ఆధారాలు లేనందున, ప్రభుత్వ హామీలు వినియోగదారులను ఒప్పించడంలో […]
Read more

మనకు బాపూజీ ఉండగా…బంగ్లాదేశ్, నేపాల్ వైపు చూడాల్సిన అవసరం లేదన్న దీప్కే!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇటీవల జరిగిన నిరసనలతో సీజేపీ ఆందోళనకు పోలికలు వస్తున్న నేపథ్యంలో…అభిజిత్‌ దీప్కే స్పందించారు. భారత విద్యార్థి ఉద్యమాలు స్ఫూర్తి కోసం దేశ చరిత్రను దాటి చూడాల్సిన అవసరం లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు మహాత్మా గాంధీ వారసత్వాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని తన నివాసంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలో సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనకూ, షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె […]
Read more
1 2 3 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.