న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్ర దాడిపై భారతదేశం ప్రతిస్పందన…కాల్పుల విరమణ అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, దానిని నిలిపివేసామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరిక చేశారు.
“దాడులు ముగియలేదని పాకిస్తాన్ తెలుసుకోవాలి, ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని నిలిపివేశారు” అని ప్రధానమంత్రి అన్నారు, “రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే దాని ఆధారంగా మేము అడుగులు వేస్తామని ప్రధాని అన్నారు. పాకిస్తాన్ వెనక్కి తగ్గితే లేదా తప్పుదారి పట్టిస్తే, “నేను దాడులు మళ్ళీ పునరావృతం చేస్తాను, మేము మా ప్రతీకార చర్యను మాత్రమే నిలిపివేసాము” అని ఆయన నొక్కి చెప్పారు, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి ఖచ్చితమైన దాడులను తిరిగి ప్రారంభిస్తామన్నారు.
‘పాకిస్తాన్ ఊహలకు అతీతంగా’
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 22 నిమిషాల ప్రసంగంలో, “భారతదేశం డ్రోన్, క్షిపణి దాడులు పాకిస్తాన్ ఊహించుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దిగ్భ్రాంతికి గురైన గురైన పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా జోక్యం కోరుతూ పిచ్చిగా ఫోన్ కాల్స్ చేసి, చివరికి DGMO స్థాయి సంభాషణను ప్రారంభించి, కాల్పుల విరమణ కోరిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
“పాకిస్తాన్ భారతదేశానికి విజ్ఞప్తి చేసి, భవిష్యత్తులో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు లేదా సైనిక సాహసానికి పాల్పడబోమని హామీ ఇచ్చినప్పుడే, భారతదేశం కాల్పుల విరమణను పరిగణించింది” అని ఆయన పేర్కొన్నారు.
‘పాకిస్తాన్ మా సరిహద్దుపై దాడి చేసింది. మేము వారి గుండెలపై దాడి చేసాం
భారతదేశం “ఖచ్చితమైన దాడులు”ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ను తీవ్ర నిరాశకు గురిచేసాయి. “పాకిస్తాన్ భారత సరిహద్దు (సీమా)పై దాడి చేయాలని ప్రణాళిక వేసింది, కానీ మేము వారి హృదయంలో (సీనా) దాడి చేసాము” అని ప్రధాని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని భవల్పూర్, మురిద్కే వంటి “ఉగ్రవాద విశ్వవిద్యాలయాల” గురించి ప్రస్తావించారు. “ప్రపంచంలోని అతిపెద్ద ఉగ్రవాద దాడులు, అది 9/11 అయినా, లండన్ ట్యూబ్ బాంబు దాడులు అయినా, లేదా గత అనేక దశాబ్దాలుగా భారతదేశంలో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు అయినా – వాటి మూలాలు ఏదో ఒక విధంగా ఈ ఉగ్రవాద స్థావరాలతో ముడిపడి ఉన్నాయి.”
భారతదేశం ఖచ్చితమైన దాడులతో ” పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను బద్దలు కొట్టడమే కాకుండా, వారి నైతికతను కూడా బద్దలు కొట్టింది” అని ప్రధాన మంత్రి జోడించారు.
‘ఆపరేషన్ సిందూర్… ఉగ్రవాదంపై కొత్త సిద్ధాంతం’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, “ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ఆపరేషన్ కాదు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం విధానంలో ఒక సిద్ధాంతపరమైన మార్పు” అని అన్నారు. “భారతదేశం ఉగ్రవాద స్థావరాలు ఉన్న చోట దాడి చేస్తుంది మరియు మన దేశంపై దాడి చేస్తే నిర్ణయాత్మకంగా అలా చేస్తుంది” అని అన్నారు.
పాకిస్తాన్ “అణు బ్లాక్మెయిల్”చేయడం… భారతదేశాన్ని నిరోధించదని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. “భారతదేశం ఎటువంటి అణ్వస్త్ర బెదిరింపులను సహించదు. అణ్వస్త్ర బెదిరింపుల ముసుగులో అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఖచ్చితంగా , నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది” అని ఆయన అన్నారు. “ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం, ఉగ్రవాద దాడి సూత్రధారుల మధ్య భారతదేశం తేడాను గుర్తించదు” అని పాకిస్తాన్ను హెచ్చరించారు.
ఈ దాడులలో ఉపయోగించిన రక్షణ పరికరాలు మనదేశంలో తయారయ్యాయని ప్రధాని మోదీ వాటి పనితీరును ప్రశంసించారు. “యుద్ధభూమిలో ప్రతిసారీ మేము పాకిస్తాన్ను ఓడించాము. ఈసారి ఆపరేషన్ సిందూర్ కొత్త కోణాన్ని జోడించింది. ఆపరేషన్ సిందూర్ రూపంలో ఎడారులు, పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రద ర్శించాం. ఈ ఆపరేషన్ ద్వారా ‘భారత్లో తయారీ’ ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. 21వ శతాబ్దపు యుద్ధంలో భారతదేశంలో తయారైన రక్షణ పరికరాల సమయం ఆసన్నమైందని నేడు ప్రపంచం చూస్తోంది.”
‘ఉగ్రవాదానికి ఇది యుగం కాదు’
“పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విధంగా, అది ఒక రోజు పాకిస్తాన్ను నాశనం చేస్తుంది. పాకిస్తాన్ ఒక దేశంగా మనుగడ సాగించాలనుకుంటే, అది దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాల్సి ఉంటుంది. శాంతికి వేరే మార్గం లేదు” అని ప్రధానమంత్రి అన్నారు.
తన ప్రసంగాన్ని ముగించిన ప్రధాని మోదీ, “ఇది యుద్ధ యుగం కాదు” అనే తన ప్రసిద్ధ కోట్కు జోడించి, “ఇది ఖచ్చితంగా యుద్ధ యుగం కాదు, కానీ ఇది ఉగ్రవాద యుగం కూడా కాదు. ఉగ్రవాదాన్ని సహనంతో ఎదుర్కోవడం మెరుగైన ప్రపంచానికి హామీ” అని అన్నారు.