ఇమారత్-ఎ-షరియా అధినేత మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ, భారత ముస్లింల ప్రాంతీయ, జాతీయ నాయకత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన శక్తిగా కూడా ఎదిగారు. భారతదేశం అంతటా 5 కోట్ల ఇమెయిల్లను సమీకరించడం ద్వారా, సరైన ప్రణాళిక, అమలుతో జిల్లా వారీగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడం, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ద్వారా ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు…దేశవ్యాప్తంగా ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
అయితే, ఆయన పెరుగుతున్న ప్రభావం త్వరలోనే ఆయనను లక్ష్యంగా చేసుకుంది. చివరికి ఆయన AIMPLBని విడిచిపెట్టవలసి వచ్చింది, కానీ ఇది సమాజం పట్ల ఆయన నిబద్ధతను అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యంలోని రాజకీయ, చట్టపరమైన కోణాలను అర్థం చేసుకుని, రంజాన్ సందర్భంగా పాట్నాలో జరిగిన అధికారిక ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ఆయన వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
అయితే, ఈ బహిష్కరణకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈద్-ఉల్-ఫితర్కు ముందు రోజు, రంజాన్ 28వ తేదీన, నితీష్ కుమార్ వర్గం మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారుల బృందం ఇమారత్-ఎ-షరియాపై దాడి చేసింది. ఆ తర్వాత ఆయనపై దారుణమైన వ్యక్తిత్వ హననం ఒకటి – అమీర్-ఎ-షరియాత్గా అతని చట్టబద్ధతను ఇమారత్ లోని సీనియర్ మతాధికారులు ప్రశ్నించడమే కాకుండా చురుకుగా సవాలు చేశారు.
ముస్లింలలో ఈ అంతర్గత విభజన రాజకీయ దోపిడీకి సరైన వాతావరణాన్ని సృష్టించింది. గందరగోళాన్ని సద్వినియోగం చేసుకుని, నితీష్ కుమార్ ప్రభుత్వం పార్లమెంటులో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది. బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీ కోసం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉండటంతో, ఈ మద్దతు బిల్లు ఆమోదాన్ని సులభతరం చేయడానికి సహాయపడింది.
దీంతో భారతదేశం అంతటా ముస్లింలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్రంగా మోసపోయామని భావించారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశంమేమిటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో ఉన్నవారితో సహా 230 మందికి పైగా పార్లమెంటు సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని ఆపడానికి నిబద్ధతను ప్రదర్శించారు.
ప్రధాన స్రవంతి ముస్లిం నాయకత్వానికి కొత్తగా ఉన్నప్పటికీ, మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఆయన అవగాహన కల్పించారు, వర్క్షాప్ల ద్వారా కీలక వ్యక్తులకు అవగాహన కల్పించారు. జిల్లాల వారీగా నెట్వర్క్ను అభివృద్ధి చేశారు. ఆయన పని రాజకీయ సంస్థలు, పౌర సమాజ సమూహాలను పోలి ఉంటుంది. వారు తరచుగా బలహీనమైన, అత్యంత అణగారిన వర్గాలతో కనెక్ట్ అవ్వడానికి చాలా కష్టపడతారు. అదేవిధంగా, మౌలానా రెహమానీ యువతకు దగ్గరయ్యారు. మీడియా విస్తరణ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించడానికి ఫజ్లూర్ రహీమ్ నాయకత్వంలో తన ప్రచురణ ఫికర్-ఓ-నజర్ను ఉపయోగించుకున్నారు.
ఫలితంగా స్మశానవాటికలు (ఖబ్రస్తాన్లు), మసీదులను (మసాజిద్) రక్షించాల్సిన ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకున్నారు. “సేవ్ వక్ఫ్” ప్రచారం సైద్ధాంతిక స్పష్టత మరియు అట్టడుగు స్థాయి క్రియాశీలతతో నడిచే ఉద్యమంగా ప్రారంభమైంది. ఈద్ అల్-అధా (బక్రీద్) ముందు, ఇమారత్-ఎ-షరియాను స్వాధీనం చేసుకోవడానికి మరొక ప్రయత్నం జరిగినప్పుడు, మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ ఒక పెద్ద ప్రజా సమావేశాన్ని ప్రకటించడం ద్వారా స్పందించారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించాలని, వక్ఫ్, రాజ్యాంగాన్ని సమర్థించాలని ఆయన పాట్నాలోని గాంధీ మైదాన్కు ముస్లింలను ఆహ్వానించారు.
ఇది సాహసోపేతమైన,ప్రమాదకరమైన చర్య. ముఖ్యంగా AIMPLBలోని అతని ప్రత్యర్థులు అతనిపై అనేక కేసులు దాఖలు చేసినందున, చాలా మంది దీనిని పేలవమైన అంచనాగా భావించారు. అయినప్పటికీ, అతనికి అతని అనుచరులు, అతని సోదరుడు ఫహద్ రెహమానీ నుండి బలమైన, తిరుగులేని మద్దతు లభించింది. అతను గ్రామీణ-పట్టణ, విద్యావంతులు-నిరక్షరాస్యులు, ధనవంతులు-పేదలు ఇలా సమాజంలోని ప్రతి వర్గంతో రాత్రింబవళ్లు నిమగ్నమై అవిశ్రాంతంగా పనిచేశాడు. ఆయన తన దివంగత తండ్రి మౌలానా వలి రెహమానీ శ్రేయోభిలాషులను సంప్రదించారు, అన్ని రాజకీయ పార్టీలలోని నాయకులను కలిశారు. గాంధీ మైదానంలో జరిగే సమావేశానికి రోడ్మ్యాప్ను సిద్ధం చేయడానికి మతపరమైన సామాజిక సంస్థలతో సమన్వయం చేసుకున్నారు.
AIMPLB భారతదేశం అంతటా బహిరంగ సమావేశాలు, రౌండ్టేబుల్ చర్చలను కొనసాగిస్తుండగా, వీటిలో చాలా వరకు ప్రత్యేక రాజకీయ వ్యక్తులు లేదా ప్రాంతీయ ప్రభావాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. “వక్ఫ్ బచావో” ప్రచారంలో విరామాలు, స్థిరమైన దృష్టి లేకపోవడం సమాజంలో ఆందోళనలను రేకెత్తించాయి. దీనికి విరుద్ధంగా, మౌలానా రెహమానీ విధానం కేంద్రీకృతమై, చరుగ్గా ఉంది. ప్రజాస్వామ్య, రాజకీయ పోరాటంపై ఆయన పట్టుదల రాజకీయంగా తరచుగా మూలన పడిన సమాజానికి కొత్త ద్వారాలు తెరిచింది.
AIMPLB అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమానీ, వక్ఫ్ అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చబోమని బహిరంగంగా ప్రకటించారు – రాబోయే బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ను జవాబుదారీగా ఉంచకూడదని ప్రభావవంతంగా సూచించారు. అయితే, వక్ఫ్ను ఇప్పుడు ప్రచార అంశంగా మార్చడం వల్ల అన్ని లౌకిక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావచ్చు, రాజకీయ గతిశీలతను నాటకీయంగా మార్చవచ్చు.
పాట్నాలో జరిగిన “వక్ఫ్ బచావో దస్తూర్ బచావో” సమావేశం భారీ విజయాన్ని సాధించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, RJD, AIMIM, SP నాయకుల హాజరు కావడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు బలమైన, స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఆసక్తికరంగా, మౌలానా అహ్మద్ ఫైసల్ రెహమానీ ఈ కార్యక్రమంలో చాలా తక్కువ మాట్లాడారు. బదులుగా, ఆయన మిగతా వక్తలను సమావేశంలో ప్రసంగించడానికి అనుమతించారు. ఆయన చర్యలు, క్షేత్రస్థాయిలో ఆయన పనితీరు ఇప్పటికే ఆయన ఏంటో చాటాయి.
ఆయన నిస్సందేహంగా ఇంకా పెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ ఈరోజు గాంధీ మైదానంలో జరిగినది చారిత్రాత్మకమైనది – కొత్త శకానికి, కొత్త తరం నాయకత్వానికి ఓ మంచి ప్రారంభం.
అల్లాహ్ ఇమారత్-ఎ-షరియాను ఆశీర్వదించుగాక. అల్లాహ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును ఆశీర్వదించుగాక. అల్లాహ్ ముస్లిం ఉమ్మాను ఏకం చేసి విభజన నుండి రక్షించుగాక (ఆమీన్…సుమ్మ ఆమీన్).