Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 72 గంటల బంద్!

Share It:

గద్వాల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు బంద్‌ చేపట్టారు. ఈ బంద్ నేటినుంచి 72 గంటల పాటు కొనసాగనుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా, గద్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల ఆవరణలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా మీడియాతో మాట్లాడుతూ అనేక డిమాండ్లు చేశారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించి ఫీజుల ముసుగులో విరాళాలు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో అశాస్త్రీయంగా పెంచిన ట్యూషన్ ఫీజుల తగ్గించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న విదేశీ స్కాలర్‌షిప్ మొత్తాల పంపిణీ చేయాలన్నారు. చట్టవిరుద్ధంగా విరాళాలు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు డిమాండ్‌ చేశారు.

అంతేకాదు విద్యా రంగంలోని అన్ని సమస్యల పరిష్కారం కోసం జూలై 2, 3, 4 తేదీల్లో చేపట్టిన 72 గంటల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులు, విద్యా సంస్థలను కోరారు. ఈ కార్యక్రమంలో USFI రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వామన్ పల్లి రంగస్వామి 72 గంటల బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

డిగ్, పీజీ కళాశాలల యాజమాన్యం కూడా బంద్‌కు తమ సహకారాన్ని, మద్దతును అందించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు మహేష్, బుడ్డన్న, ఇమ్రాన్, శివ, చరణ్, సమీర్, నరసింహులు, జగన్, గురుమూర్తి, ధనుష్, ప్రవీణ్ కుమార్ సహా అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొఫెషనల్ విద్యలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నేతృత్వంలోని ఈ ఆందోళన ఒక ప్రధాన నిరసనగా ఊపందుకుంది. విద్యా యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నుండి పెరుగుతున్న మద్దతుతో, 72 గంటల బంద్‌ విజయవంతం అయ్యే అవకాశం ఉంది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.