బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించి ప్రతీసారీ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. ట్రిపుల్ తలాక్ లేదా హలాలా, ముస్లిం పర్సనల్ లా లేదా వక్ఫ్, మసీదులు లేదా మదర్సాలు, హిజాబ్ లేదా మాంసం వినియోగం ఏదైనా కావచ్చు, దేశ పాలక వర్గం ముస్లింలను, ఇస్లాంను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ సమస్యలే కాదు, భవిష్యత్తులో ముస్లింలు ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారానికి అవసరమైన దూరదృష్టిని ముస్లిం నాయకత్వం చూపించకపోవడమే దీనికి ప్రధాన కారణం.
అధికారిక అంచనాల ప్రకారం, భారతదేశం అంతటా 872,328 వరకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులలో మసీదులు, మదర్సాలు, స్మశానవాటికలు, దర్గాలు, షెల్టర్లు, దాతృత్వ సంస్థలు, ఖాళీగా ఉన్న భూములు మొదలైనవి ఉన్నాయి, ఇవి 30 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో 3.8 మిలియన్ ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం అంచనా విలువ రూ. 1.2 ట్రిలియన్లు. ఈ ఆస్తులలో నాలుగు లక్షలపైగా ఎకరాల భూమి “వినియోగదారుల పక్షాన వక్ఫ్” ఆస్తులు, వీటిని కొత్తగా అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025 ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. 73వేల ఎకరాలకు పైగా ఆస్తులు వివాదంలో ఉన్నాయి. సవరించిన చట్టంలోని కొన్ని నిబంధనల ద్వారా ప్రభావితమవుతాయి.
1995 వక్ఫ్ చట్టాన్ని సవరించే లక్ష్యంతో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 గత సంవత్సరం ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తరువాత ఏప్రిల్ 2025లో సభ ఆమోదించినప్పటి నుండి, భారతదేశ ముస్లింల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సవరించిన చట్టం ప్రకారం ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బిల్లు చట్టంగా మారిన తర్వాత, దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ముస్లిం, ప్రభుత్వ పక్షాల నుండి ఒక నెలకు పైగా వాదనల తర్వాత, న్యాయమూర్తులు మే 22న తీర్పును రిజర్వ్ చేశారు. జూలైలో కోర్టులు తిరిగి తెరిచిన తర్వాత తుది తీర్పు రానుంది.
సవరించిన చట్టానికి వ్యతిరేకంగా దేశ సుప్రీంకోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి, కానీ ఐదు మాత్రమే ఆమోదించారు. ఈ ఐదు పిటిషన్లలో ఒకటి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, మరొకటి జమియత్ ఉలేమా-ఎ-హింద్ వర్గం నాయకుడు అర్షద్ మదానీ, మిగిలినవి మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు. ముస్లింలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని నిర్ణయాల దృష్ట్యా, తీర్పు ఎవరి వైపు వెళ్తుందో ఎవరినా ఇట్టే ఊహించవచ్చు.
వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదం పొందినప్పటి నుండి, వివిధ ముస్లిం మత మరియు సామాజిక సంస్థలు, ముఖ్యంగా జమియత్ ఉలేమా మరియు జమాత్-ఎ-ఇస్లామి-హింద్, అలాగే అనేక ఇతర సంస్థలు, మేధావులు, కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రసంగాలు , పత్రికా సమావేశాల ద్వారా కొత్త చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం ఐక్యత, సంఘీభావాన్ని ప్రదర్శించారు. రెండు నెలల క్రితం, కొత్త చట్టంపై ముస్లింల వ్యతిరేకతను నమోదు చేయడానికి దేశవ్యాప్తంగా ముస్లిం నాయకత్వం ద్వారా కోవిడ్-యుగం నాటి థాలీ-బీటింగ్ జిమ్మిక్ మాదిరిగానే 15 నిమిషాల “బట్టీ గుల్” లైట్-ఆఫ్ ప్రచారం కూడా నిర్వహించారు. మొత్తం ముస్లిం సమాజం, నాయకత్వం వారి నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొన్నట్లు అనిపించింది. శతాబ్దాలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులను తిరిగి పొందడం మరియు రక్షించడం అనే ఆలోచన వారి సామూహిక మనస్సాక్షిని అకస్మాత్తుగా కదిలించినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు చిందిన పాల గురించి ఏడ్చి ప్రయోజనం లేదు.
ఊహించని వర్గాల నుండి మద్దతు
ముస్లిమేతర లౌకిక నాయకులు, పార్టీలు, శాసనసభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో, వెలుపల తమ గొంతులను వినిపించకపోతే, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) మైనారిటీ స్వభావానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వలె ఈ బిల్లు కూడా ఒక రోజు ఎటువంటి గందరగోళం లేకుండా చట్టంగా మారేది ముస్లింలు నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజు మాత్రమే దాని గురించి తెలుసుకునేవారు.
ట్రిపుల్ తలాక్
ఒక్క వక్ఫ్ చట్టం మాత్రమే కాదు..నిద్రపోతున్న ముస్లిం సమాజాన్ని మేల్కొల్పడానికి చేసే ప్రయత్నాలు విపత్తు సంభవించిన తర్వాత మాత్రమే మరింత తీవ్రమవుతాయి. “ట్రిపుల్ తలాక్” చట్టమే దీనికి ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం దానిని తన ఇష్టానుసారం మార్చుకుంది. ముస్లింల స్వయం ప్రకటిత నాయకులు ఏమీ చేయలేకపోయారు.
హలాలా శాపం
తదుపరిది హలాలా. హలాలా ప్రయోజనం కోసం జరిగే వివాహం వివాహం కాదు, వ్యభిచారం. అల్లాహ్ దూత (ﷺ) హలాలా చేసేవారిని శపించాడు. ముస్లిం మత, సామాజిక మరియు రాజకీయ నాయకులు ముస్లింలలో ఈ దారుణమైన ఆచారాన్ని పట్టించుకోలేదు. దానిని తొలగించడానికి కృషి చేయలేరు. కానీ ఈ పనిని ప్రభుత్వం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇది చివరకు ఉమ్మడి పౌరస్మృతి తెచ్చేందుకు దారి తీస్తుంది.
ఉర్దూ, అల్లర్లు, వ్యక్తిగత చట్టం
భారతదేశంలోని 22 అధికారిక భాషలలో ఉర్దూ ఒకటి. కానీ దాని పట్ల మనం అవలంబించిన వైఖరి, దేశంలో ఈ భాష వ్యతిరేక వైఖరిని బట్టి, ఈ భాష అధికారిక హోదా కూడా రద్దయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. నిరాశాజనకమైన ముస్లిం నాయకులు,మిల్లత్ తీపి కలలలో మునిగిపోయి ఈ విపత్తును కూడా షాక్ లేకుండా భరిస్తారు. ఉర్దూ సహాయంతో బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్య్రాన్ని సాధించుకున్న సంగతిని మనం మరవరాదు.
దశాబ్దాలుగా ముస్లిం వ్యతిరేక అల్లర్లు మరియు వాటిని సహించిన తర్వాత, “జై శ్రీ రామ్” నినాదాలతో మసీదుల వెలుపల మూక దాడులను మరియు హింసాత్మక ఊరేగింపులను ఆపడానికి ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోకపోతే… మసీదులు, మదర్సాలు మరియు స్మశానవాటికలను ఆక్రమించడం కూడా చట్టబద్ధంగా సమర్థించవచ్చు. ముస్లింలు తమ మతపరమైన స్థలాలను కోల్పోవలసి రావచ్చు. వక్ఫ్ చట్టం ఆ దిశలో మొదటి అడుగుగా కనిపిస్తోంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రాక్సీ ద్వారా అధికారంలోకి రావడానికి RSS తన ప్రయత్నాలను ప్రారంభించింది. నేడు, వారి వ్యూహం విజయవంతమైంది. మూక దాడుల కూడా ఆ ప్రణాళికలో ఒక భాగం.
ముస్లిం పర్సనల్ లాను రద్దు చేయడానికి దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి ముప్పు సంవత్సరాలుగా ముస్లింలపై పొంచి ఉంది. కానీ ఈ ముప్పును ఎదుర్కోవడానికి తగిన చర్యలు అమలు చేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రతి వ్యూహాన్ని ఉపయోగిస్తోంది.
క్రైస్తవులు తమ పవిత్ర స్థలాలను ప్రార్థనా స్థలాలకే పరిమితం చేసుకోలేదు, విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవలను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారు ప్రజలకు సేవ చేయడానికి ప్రతి సంస్థను నిర్మించారు, వారికి ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు. అటువంటి సంస్థలను స్థాపించడానికి మాకు వక్ఫ్ భూములు కూడా ఉన్నాయి.
మన పండితులు, బాధ్యతాయుతమైన వ్యక్తులు, వక్ఫ్ బోర్డుల అధికారులు లేదా మరే ఇతర నాయకుడు అలాంటి చర్యలు తీసుకున్నారా? వారి ఇళ్లను నింపడమే కాకుండా, ఈ దేశంలో మన భవిష్యత్ తరాలు ఎలా శాంతి మరియు సామరస్యంతో జీవిస్తాయో వారు ఎప్పుడైనా ఆలోచించారా? మసీదుల ఇమామ్లు జీతాల కోసం అడుక్కుంటూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. నేడు, అందరూ మేల్కొని ఉన్నారు లేదా మేల్కొని ఉన్నట్లు నటిస్తున్నారు. అకస్మాత్తుగా అందరూ రక్తపు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పాము బయటకు వచ్చింది. వారేమో దాని నీడను కొడుతున్నారు. డ్రాగన్ లాంటి వక్ఫ్ చట్టం ముస్లింల వారసత్వాన్ని మింగడానికి వేచి ఉంది. లెక్కలేనన్ని వక్ఫ్ ఆస్తులు ముస్లిమేతరుల చేతుల్లోకి లాక్కోవడం లేదా వారి చేతుల్లోకి వెళ్లడం చేదు వాస్తవం. ఓ భారతీయ ముస్లింలారా ఇప్పుడైనా మేల్కొనండి.
మీ ఇళ్ల నుండే సంస్కరణ ప్రారంభించండి.
విద్యా వ్యవస్థను నిర్మించుకోండి.
మీ చైతన్యాన్ని మేల్కొలపండి.
కొద్ది సమయమే మిగిలి ఉంది.
లేవండి, లేకుంటే మళ్లీ పునరుత్థానం ఉండదు.