గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముట్టడి కారణంగా ఆహారం, మందులు, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి రావడం లేదని మానవతా సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది మార్చి 2 నుండి, ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించింది. మే నుండి పరిమిత సహాయం అనుమతించినప్పటికీ, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ, పనుల సంస్థ (UNRWA) మార్చి నుండి ఆహారాన్ని పంపిణీ చేయకుండా నిషేధించిందని తెలిపింది. గాజాలోని UNRWA సొంత సిబ్బంది కూడా ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడుతున్నారు.
డిమాండ్ కారణంగా ఆహార ధరలు పెరుగుతున్నాయి
మరోవంక బ్రెడ్, బియ్యం, చక్కెర వంటి ప్రాథమిక వస్తువులు కూడా గాజాలో కొనడానికి చాలా ఖరీదైనవి. ఇప్పుడు ఒక్క బ్రెడ్ ముక్క ధర 3 డాలర్లు. ఒక కిలో చక్కెర ధర 100 డాలర్లు కాగా, బియ్యం, పిండి ధర 30 డాలర్లు. పప్పు ధాన్యాల ధర దాదాపు 23 డాలర్లు – కేవలం ఐదు ప్రధాన వస్తువుల ధర 183 డాలర్లు (సుమారు రూ. 15000) కు చేరుకుంది. ఈ ధరలు 4,000 శాతానికి పైగా పెరగడంతో కుటుంబాలు కనీసం ప్రాథమిక జీవనోపాధిని కూడా పొందలేకపోతున్నాయి.

X ని పరిశీలిస్తే యూఎన్ ఏజెన్సీ ఇలా రాసింది, “గాజాలో ఆకలితో ఉన్న పురుషులు, మహిళలు, పిల్లల కనీసం తమ ప్రాణాలు నిలిపేందుకైనా ఆహారం దొరక్కపోతుందా అని వేచి ఉన్నాయి. కొంతమంది రోజుల తరబడి తినకుండా గడుపుతున్నారు… ఇది మానవ నిర్మిత, రాజకీయంగా ప్రేరేపించిన ప్రజల ఆకలి. ముట్టడిని ఎత్తివేయండి.”
మానవతా సహాయం రానీయకపోవడంతో గాజాలో ఒక మిలియన్ మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని కూడా ఏజెన్సీ హెచ్చరించింది.

పోషకాహార లోపం సంకేతాలను చూపిస్తున్న పాలస్తీనా పిల్లలు గాజా నగరంలోని యూఎన్ ఏజెన్సీ క్లినిక్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గాజా నగరంలోని UNRWA క్లినిక్లో పరీక్షించిన పోషకాహార లోపం ఉన్న పాలస్తీనియన్ పిల్లలు.
“ఈ శరీరాలలో బలం లేదు” అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. “వారి శరీరాలు ఇకపై ఆకలిని తట్టుకోలేకపోవడంతో వందలాది మంది మరణాన్ని ఎదుర్కొంటున్నారు.”
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 650,000 మందికి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వేలాది మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని హెచ్చరించింది.
పరిస్థితి గతంలో కంటే దారుణంగా ఉందని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అంటున్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ మునీర్ అల్-బర్ష్ మాట్లాడుతూ, “గాజాలో, ఆహారం ఇకపై ఒక హక్కు కాదు. ఇది రాత్రిపూట తల్లులు గుసగుసలాడుతూ ఆకలితో ఉన్న పిల్లల దృష్టిలో గీసిన నెరవేరని కోరిక. ఒక చిన్న బ్రెడ్ ముక్క కోల్పోయిన నిధిగా మారింది.”
ఆహార ఉత్పత్తి, జీవనోపాధి నాశనం
గాజా ఆహార ఉత్పత్తి వ్యవస్థలు కూలిపోయాయి. ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) UN భద్రతా మండలికి సమర్పించిన జూన్ 2025 నివేదిక ప్రకారం… ఇజ్రాయెల్ వైమానిక దాడులు, నీరు, విత్తనాలు, ఎరువులు వంటి అవసరమైన సామాగ్రి లేకపోవడం వల్ల 70 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ భూమి నాశనం అయి నిరుపయోగంగా మారింది.
పశువుల రంగం దాదాపు పూర్తిగా కుప్పకూలింది – 95 శాతం జంతువులు ఆకలితో లేదా చికిత్స చేయని అనారోగ్యం కారణంగా చనిపోయాయి. మత్స్య పరిశ్రమ కూడా నాశనమైంది. ఇజ్రాయెల్ విధించిన సముద్ర ఆంక్షల కారణంగా 80 శాతానికి పైగా పడవలు నిష్క్రియంగా ఉన్నాయి. జూలై 19న గాజా తీరంలో నలుగురు నిర్బంధించిన వారితో సహా అనేక మంది మత్స్యకారులు మరణించారు, మరికొంత మంది గాయపడ్డారు. ఇంకొందరు అరెస్టు అయ్యారు.
మొత్తంగా ఇజ్రాయెల్ దమనకాండ కారణంగా 59,000 మందికి పైగా పాలస్తీనియన్లు, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చంపేశారు. కాల్పుల విరమణ పిలుపులకు సమాధానం లేదు.. గాజా నిశ్శబ్దంగా ఆకలితో అలమటిస్తూనే ఉంది.