Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందిస్తాం…తెలంగాణ ఉద్యాన వర్సిటీ!

Share It:

హైదరాబాద్: తెలంగాణలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టేలా హార్టికల్చర్‌ వర్సిటీ అడుగులు వేస్తోంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGSHU) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఉద్యానవన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది.

ఈమేరకు నిన్నరాజేంద్రనగర్‌లోని ఉద్యానవన విశ్వవిద్యాలయ కళాశాలలో జరిగిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి. రాజి రెడ్డి మాట్లాడుతూ…అధిక నాణ్యత గల ఉత్పత్తితో అధిక దిగుబడి, లాభాలను సాధించడమే లక్ష్యం అని అన్నారు.

ఓపెన్-పరాగసంపర్క రకాలు, హైబ్రిడ్ రకాల కూరగాయల పంటలలో విత్తనాల ధర చాలా ఎక్కువగా ఉందని, నాణ్యమైన ఉత్పత్తి లక్ష్యంగా విత్తన కంపెనీలు, ప్రభుత్వ సంస్థలను ముందుకు సాగాలని ఆయన కోరారు. రాబోయే పర్యావరణ మార్పులు, తెగుళ్ళు, వ్యాధుల ఒత్తిడిని తట్టుకోగల విత్తన రకాలను త్వరలో రైతులకు అందించడానికి ప్రయత్నాలు జరుగుతాయని ఆయన తెలియజేశారు.

ఇంట్లో, పెరట్లో పండించడానికి తక్కువ పరిమాణంలో అవసరమైన దేశీయ కూరగాయల విత్తనాలు కూడా అందరికీ అందుబాటులో ఉంచనున్నారు.

సమావేశంలో పాల్గొన్న జాతీయ విత్తన సంఘం ప్రతినిధులు మార్కెట్లో వినియోగదారులు ఇష్టపడే కూరగాయల పంటల రకాలను వివరించారు. విశ్వవిద్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చేసిన కూరగాయల రకాలు రైతులకు అందుబాటులో ఉంటాయని వారు హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTGSAU) మాజీ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కూరగాయల పంటలలో నాణ్యమైన విత్తనోత్పత్తికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.