Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కీలకమైన దౌత్య పర్యటనలకు సిద్ధమైన భారత్…ఢిల్లీలో వాంగ్, మాస్కోలో జైశంకర్!

Share It:

న్యూఢిల్లీ: వచ్చే వారం భారత్ రెండు ప్రధాన దౌత్య పర్యటనలకు సిద్ధమైంది. ఓ వైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యికి మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు రష్యా ముడి చమురు సేకరణపై ట్రంప్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ సంబంధాలలో ఉద్రిక్తత మధ్య విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కోకు వెళుతున్నారు.

షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు కొన్ని రోజుల ముందు, NSA అజిత్ దోవల్‌తో సరిహద్దు చర్చలు జరపడానికి వాంగ్ ఆగస్టు 18న భారతదేశాన్ని సందర్శించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

కాగా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో కీలకమైన చర్చలు జరపడానికి జైశంకర్ రెండు రోజుల పర్యటన కోసం ఆగస్టు 20న మాస్కోకు వెళుతున్నారు. ఈ సంవత్సరం చివర్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు ప్రణాళికలు సిద్దం చేయడంపై ఈ పర్యటన దృష్టి సారించే అవకాశం ఉంది.

డోవల్ మాస్కోకు వెళ్లి అధ్యక్షుడిని, అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను కలిసిన కొన్ని రోజుల తర్వాత విదేశాంగ మంత్రి రష్యా పర్యటన జరుగుతుంది. రష్యా నాయకులతో జైశంకర్ సమావేశాల్లో రష్యా నుండి భారతదేశం ముడి చమురు కొనుగోలు కొనసాగించడం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. అదనపు సుంకాలు భారతదేశంపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచాయి.

సరిహద్దు సమస్యపై తదుపరి రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల (SR) సంభాషణ కోసం చైనా విదేశాంగ మంత్రి ప్రధానంగా భారతదేశాన్ని సందర్శిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు చర్చల నిమిత్తం వాంగ్, దోవల్ ప్రత్యేక ప్రతినిధులుగా నియమితులైన విషయం తెలిసిందే.

రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన సమావేశంలో మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరుపక్షాల మధ్య చర్చలను పునరుద్ధరించాలని నిర్ణయించిన కొన్ని వారాల తర్వాత…అజిత్‌ ధోవల్‌ గత డిసెంబర్‌లో చైనాకు వెళ్లి వాంగ్‌తో చర్చలు జరిపారు. జైశంకర్‌తో వాంగ్ కూడా విడిగా సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. కాగా, SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి మోడీ ఈ నెల చివర్లో చైనాకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం…మోడీ ఆగస్టు 29న జపాన్ పర్యటనకు బయలుదేరుతారు. పర్యటన ముగిసాక, ఆగస్టు 31-సెప్టెంబర్ 1వ తేదీలలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ఉత్తర చైనా నగరమైన టియాంజిన్‌కు వెళతారు.

2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా దళాల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణల తర్వాత బీటలువారిన ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దుకోవడానికి ఇరుపక్షాలు చేస్తున్న ప్రయత్నాల మధ్య మోడీ చైనా పర్యటనను ప్లాన్ చేస్తున్నారు.

తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభన 2020 మేలో ప్రారంభమైంది. ఆ సంవత్సరం జూన్‌లో గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలు సంబంధాలలో తీవ్ర ఒత్తిడికి దారితీశాయి.

గత సంవత్సరం అక్టోబర్ 21న ఖరారు చేసిన ఒప్పందం ప్రకారం డెమ్‌చోక్, డెప్సాంగ్‌లోని చివరి రెండు ఘర్షణ పాయింట్ల నుండి విడిపోయే ప్రక్రియ పూర్తయిన తర్వాత ముఖాముఖి సమర్థవంతంగా ముగిసింది.

అక్టోబర్ 23, 2024న కజాన్‌లో మోడీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశంలో చర్చలు పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు. డెప్సాంగ్, డెమ్‌చోక్ కోసం భారతదేశం, చైనా విడిపోయే ఒప్పందాన్ని ధృవీకరించిన రెండు రోజుల తర్వాత మోడీ-జిన్పింగ్ సమావేశం జరిగింది.

కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభం, న్యూఢిల్లీలో చైనా జాతీయులకు పర్యాటక వీసాల జారీని పునఃప్రారంభించడం వంటి సంబంధాలను తిరిగి నెలకొల్పేందుకు ఇరుపక్షాలు అనేక చర్యలను ప్రారంభించాయి. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి విధివిధానాలను కూడా ఇరుపక్షాలు చర్చిస్తున్నాయి.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ గత రెండు నెలల్లో షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాలకు హాజరు కావడానికి చైనాను సందర్శించారు. చైనా ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉంది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.