Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘న్యాయవ్యవస్థ రక్తసిక్తమైంది’…NCERTపై మండిపడ్డ సుప్రీంకోర్టు!

Share It:

న్యూఢిల్లీ: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అన్న అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధించాలని భారత సుప్రీంకోర్టు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)ని ఆదేశించింది.

ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ (వాల్యూమ్ II) అనే పుస్తకంలో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయం ఉంది, ఇది “న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి”తో పాటు న్యాయమూర్తుల కొరత, సంక్లిష్టమైన విధానాలు, పేలవమైన మౌలిక సదుపాయాల కారణంగా భారీ కేసులు పెండింగ్‌లో ఉండటం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, విపుల్ ఎం.పంచోలిలతో కలిసి, అటువంటి కంటెంట్‌ను చేర్చడాన్ని న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరచడానికి వేసిన కుట్ర”గా అభివర్ణించారు.

సంస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఇది “ప్రమాదకర చర్య” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది, “వారు కాల్పులు జరిపారు. న్యాయవ్యవస్థ రక్తం ఓడుతోంది.” ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థన గౌరవాన్ని కించపరిచేందుకు, అధికారాలను అణచివేసేందు చేపట్టిన చర్యగా కనిపిస్తోంది. ఇది ఇలాగే వదిలేస్తే.. ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పవిత్రతను దెబ్బతినే అవకాశం ఉంది’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. బాధ్యులపై లోతైన దర్యాప్తుకు పిలుపునిచ్చారు.

అంతేకాదు, జవాబుదారీతనం వచ్చే వరకు దీన్ని తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన జస్టిస్ సూర్యకాంత్.., దీని వెనక ఉన్నది ఎవరో తెసుకోవాలని అనుకుంటున్నామని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాపీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, డిజిటల్ వెర్షన్‌లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను పాటించనందుకు ధిక్కార చర్యలు సహా “తీవ్రమైన చర్యలు” తీసుకుంటామని కేంద్రం, రాష్ట్ర అధికారులను హెచ్చరించింది. ఇందులో పాల్గొన్న వారిపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలని NCERT డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శి (విద్యా మంత్రిత్వ శాఖ)కి షో-కాజ్ నోటీసులు జారీ చేశారు.

విద్యా మంత్రిత్వ శాఖ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. NCERT గతంలో పుస్తకాన్ని ఉపసంహరించుకుందని వివరణ ఇచ్చారు. కానీ నిజమైన క్షమాపణ లేకపోవడం మరియు కంటెంట్‌ను సమర్థించడానికి ప్రయత్నించినందుకు బెంచ్ విమర్శించింది.

ఈ విషయం తదుపరి విచారణ కోసం మార్చి 11కు వాయిదా వేశారు. కాగా, ఈ ఘటనపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఆయన.. ఎన్సీఈఆర్టీపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.