హైదరాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ విధానాలు సరైన మార్గంలో లేవని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో యుద్ధం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేత హెచ్చరించారు.
ప్రస్తుత జాతీయ పరిస్థితిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ…పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని రాహుల్ గాంధీ నాయకులను కోరారు. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.
కాగా, ఇండో-అమెరికన్ వాణిజ్య ఒప్పందంతో ప్రమాదం ఉందని అన్నారు. చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తోందని, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య చైనా, రష్యా రెండూ ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.
మన ప్రధాని… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు “పూర్తిగా లొంగిపోయారని”, వాషింగ్టన్ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా… కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు వెనుకబడిన తరగతుల (బిసి) రిజర్వేషన్లను పెంచడానికి పార్లమెంటులో ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు, దీనికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు.
కాగా, ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కె సి వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఎస్ఎపి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన సమావేశం తర్వాత, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి… డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ…మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్లను ప్రదర్శించడం, ప్రాథమిక జియు-జిట్సు ఎత్తుగడలను వివరించారు. తద్వారా డిసిసి అధ్యక్షులు తమ వ్యక్తిగత జీవితాల్లో క్రమశిక్షణ, స్వీయ నియంత్రణను అలవర్చుకోవాలని , రాహుల్ గాంధీ ప్రోత్సహించారు. కాంగ్రెస్ సిద్ధాంతంపై జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వ్యక్తిగత అహంకారాలను పక్కనపెట్టి పార్టీ వృద్ధికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
డిసిసి అధ్యక్షులు అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించి, ప్రతి నియోజకవర్గంలో కనీసం పది మంది కొత్త నాయకులను సిద్ధం చేయాలని కోరారు. వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.

