న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ హత్యకు సంతాపం వ్యక్తం చేస్తూ భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు, అలాగే ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిని ఖండించలేదు. ఈ మౌనాన్ని కొంతమంది పరిశీలకులు న్యూఢిల్లీ విదేశాంగ విధాన వైఖరిలో గణనీయమైన మార్పుకు సూచనగా భావిస్తున్నారు.
దీనికి విరుద్ధంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై దాడిని తీవ్రంగా ఖండించారు ఇరాన్ దాడులలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా, మోడీ ఎమిరాటీ నాయకత్వం, ప్రజలతో సంఘీభావం తెలిపారు.
మోదీ తన సంభాషణ వివరాలను ఎక్స్లో పంచుకున్నారు: “UAE అధ్యక్షుడు, నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడారు. UAEపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు… ఈ దాడులలో ప్రాణనష్టానికి సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయాల్లో భారతదేశం UAEకి సంఘీభావంగా నిలుస్తుందని మోదీ అన్నారు. అంతేకాదు UAEలో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోడీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. ఇటీవలి పరిణామాలపై భారతదేశపు ఆందోళనలను తెలియజేసారు, పౌరుల భద్రతను ప్రాధాన్యతగా నొక్కి చెప్పారు. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరాన్ని భారతదేశం పునరుద్ఘాటిస్తుందని అన్నారు.”
ఇదిలా ఉండగా…ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించాలని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేసింది. ఈ దాడి చట్టవిరుద్ధం, దురాక్రమణగా అభివర్ణించింది. దీని పట్ల మౌనంగా ఉండకూడదని ఓ ప్రకటన జారీ చేసింది. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ “ఈ క్షమించరాని నేరానికి తీవ్ర పరిణామాలను” ఎదుర్కొంటాయని హెచ్చరించింది.
“ఇరాన్ దేశం, ఎప్పటిలాగే దృఢ సంకల్పంతో తన గొప్ప మార్గాన్ని కొనసాగిస్తుందని రాయబార కార్యాలయం తెలిపింది. “అమరవీరుల” త్యాగం ఇరాన్ ప్రజల స్వాతంత్ర్యం, గౌరవం, ఆదర్శాలను కాపాడుకోవడంలో వారి సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని కూడా ఆ ప్రకటనలో ఇరాన్ తెలిపింది.
ఖమేనీ హత్యపై ప్రధానమంత్రి మోదీ నేరుగా వ్యాఖ్యానించడం మానుకున్నప్పటికీ, ఈరోజు న్యూఢిల్లీలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన దౌత్యం” కోసం పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితిని తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా ఆయన అభివర్ణించారు. “భారతదేశం శాంతి, స్థిరత్వం కోసం నిలుస్తుంది” అని పునరుద్ఘాటించారు. అయితే, ఆయన తన వ్యాఖ్యలలో ఇరాన్ లేదా ఖమేనీ హత్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
ఇరాన్కు సంబంధించి న్యూఢిల్లీ ప్రస్తుత వైఖరి వెనుక కారణాలు ఏమైనప్పటికీ, ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్న కాలంలో టెహ్రాన్తో భారతదేశ సంబంధాలు తరచుగా దెబ్బతిన్నాయని దౌత్య వర్గాలలో విస్తృతంగా అంగీకరిస్తున్న విషయం.
మీడియా నివేదికల ప్రకారం… డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని ఖమేనీ అప్పటి ఇరాన్ రాయబారి హమీద్ అన్సారీతో లేవనెత్తారు. ఈ సంఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా న్యూఢిల్లీకి తన అసంతృప్తిని తెలియజేసింది.
సంవత్సరాలుగా, భారతదేశం తన ముస్లిం మైనారిటీల పట్ల వ్యవహరించిన తీరును, ముఖ్యంగా 2020 మత అల్లర్ల సందర్భంలో ఖమేనీ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగ హోదా రద్దుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కానీ, 1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ “జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితి”పై ముసాయిదా తీర్మానాన్ని నిరోధించడంలో ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ పాత్రను భారత ప్రభుత్వం మరచిపోయింది. జెనీవాలో జరిగిన 50వ సమావేశంలో పాకిస్తాన్ కాశ్మీర్పై తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. UNCHR తీర్మానాన్ని ఆమోదించినట్లయితే, అది జమ్మూ కాశ్మీర్లో ఈ అంశంపై అంతర్జాతీయ పరిశీలనకు దారితీసేది. కానీ ఇరాన్ జోక్యం చేసుకుని పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇవ్వకుండా ఇతర సభ్యులను సమీకరించింది. ముసాయిదా తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారు. కాశ్మీర్లో దాని మానవ హక్కుల రికార్డుపై అంతర్జాతీయ విమర్శల నుండి భారతదేశం తప్పించుకుంది.
