టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం 36రోజుకు చేరింది. ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లను రక్షించగా, మూడో పైలట్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం టెహ్రాన్ గాలిస్తోంది. మొదట, రెండు సీట్లు గల అమెరికా ఎఫ్-15ఈ జెట్ను ఇరాన్లో కూల్చివేశారు. దానిలోని ఇద్దరు సిబ్బందిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు రక్షించాయని, మరొకరు గల్లంతయ్యారని అమెరికా మీడియా నివేదించింది.
31.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 289 కోట్లు) విలువైన ఈ అమెరికా ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానంలో ఒక పైలట్, వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ ఉంటారు. రక్షించిన ఇద్దరిలో ఎవరున్నారనేది స్పష్టంగా తెలియరాలేదు.
రెండో విమానం ఏ-10 వార్హాగ్ యుద్ధ విమానం. ఒక్కో జెట్కు సుమారు 18.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 174 కోట్లు) ఖర్చవుతుంది. ఈ విమానం కువైట్పై కూలిపోగా, పైలట్ సురక్షితంగా బయటకు దూకారు. రెండో విమానం, ఏ-10 వార్హాగ్ యుద్ధ విమానం. ఒక్కో జెట్కు సుమారు 18.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 174 కోట్లు) ఖర్చవుతుంది. ఈ విమానం కువైట్పై కూలిపోగా, పైలట్ సురక్షితంగా బయటకు దూకారు.
2003లో అమెరికా ఇరాక్పై దాడి చేసిన సమయంలోనే చివరిసారిగా ఒక అమెరికన్ యుద్ధ విమానం శత్రువుల చేతిలో కూలిపోయిందని సమాచారం.
గల్లంతైన పైలట్ కోసం గాలింపు చర్యల్లో పాల్గొన్న రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా ఇరాన్ దాడి చేసింది, కానీ అవి ఇరాన్ గగనతలం నుండి బయటపడ్డాయని ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
కాగా, కూల్చివేసిన విమానాల గురించి వైట్ హౌస్ గానీ, పెంటగాన్ గానీ బహిరంగ సమాచారాన్ని విడుదల చేయలేదు, కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు “సమాచారం అందించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు.
ఎన్బిసి న్యూస్తో మాట్లాడుతూ, ఎఫ్-15 నష్టం ఇరాన్తో చర్చలను ప్రభావితం చేయదని ట్రంప్ అన్నారు. “మన విమానాలు టెహ్రాన్, వారి దేశంలోని ఇతర ప్రాంతాలపై ఎగురుతున్నంతగా ఇరాన్ సైన్యం ఓడిపోయింది” అని ట్రంప్ చెప్పిన వారం రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. “వారు దాని గురించి ఏమీ చేయలేరు,” అని ఆయన అన్నారు.
కువైట్లోని క్యాంప్ బ్యూహ్రింగ్ స్థావరం వద్ద డ్రోన్ దాడిలో ఇరాన్, అమెరికాకు చెందిన ఒక CH-47 చినూక్ హెలికాప్టర్ను కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇరాన్ దళాలు కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను పదేపదే లక్ష్యంగా చేసుకున్నాయి.
అమెరికా పైలట్ను పట్టుకున్న వారికి బహుమతి ఇస్తామన్న ఇరాన్
స్థానిక అధికారిక ఛానెల్లో ఒక ఇరాన్ టెలివిజన్ విలేకరి, అమెరికా పైలట్ను సజీవంగా పట్టుకున్న వారికి “విలువైన బహుమతి” లభిస్తుందని చెప్పారు. “శత్రువు దళాలను” పట్టుకున్న లేదా హతమార్చిన వారికి ప్రశంసాపత్రం ఇస్తామని ఒక ఇరాన్ గవర్నర్ కూడా హామీ ఇచ్చారు.
నైరుతి ఇరాన్లో విమానం కూలిపోయిన ప్రదేశానికి సమీపంలో గాలిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం “పాలన మార్పు” నుండి వారి పైలట్ల వేటగా దిగజారిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ అన్నారు.
ఎలాగైనా ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఎఫ్-15ఈ సిబ్బందిని అదుపులోకి తీసుకుని బంధించాలని ఇరాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలతో అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తాము అమెరికా నిఘా వ్యవస్థకు సహకరిస్తున్నామని… అంతేకాకుండా ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఇరాన్లో తలపెట్టిన దాడులను కూడా రద్దు చేసుకున్నామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇక, ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ అనేది బోయింగ్ తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్. దీనిని గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూమిపైకి దాడి చేసే మిషన్ల కోసం రూపొందించారు. దీనిని ఇద్దరు సిబ్బంది నడుపుతారు. వివిధ రకాల పోరాట కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యం ఉండటంతో… ఘర్షణల సమయంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు.
Images of the US CH-47 helicopter in Kuwait, which was targeted by Iran.
— Press TV 🔻 (@PressTV) April 4, 2026
Follow https://t.co/B3zXG74hnU pic.twitter.com/oPrEnJ9Tfg

