Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పవిత్ర గంగా నదిలో పడవ పార్టీ…ఒకరి అరెస్టు, రాజకీయ వివాదం!

Share It:

వారణాసి: ఇటీవలే బిర్యానీ పార్టీ కేసులో 14 మందికి జైలు శిక్ష పడిన కొద్ది రోజులకే, గంగానదిలో ఒక పడవపై కొందరు వ్యక్తులు బీరు తాగుతూ, నృత్యం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో వారణాసి పోలీసులు రాజ్‌భర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

చైత్ర నవరాత్రుల అనంతరం మంఝీ సమాజం నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా జరిగినట్లు చెబుతున్న ఈ వేడుకల మధ్య, రాజ్‌భర్ అర్ధనగ్నంగా మద్యం సేవిస్తున్నట్లు ఆ క్లిప్‌లో ఉంది.

https://www.instagram.com/reel/DWzF5qwiWRX/?igsh=bXRtNjNnZDZqbDV5

పోలీసులు కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 352 (శాంతి భంగాన్ని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన పవిత్ర నదిని అపవిత్రం చేయడంపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రజలకు ఇబ్బంది, శబ్ద కాలుష్యం, గంగానది పవిత్రతను పరిరక్షించే చట్టాల ఉల్లంఘనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇటీవలే గంగానదిలో ఓ పడవపై ఇఫ్తార్ విందు నిర్వహించినందుకు మార్చిలో 14 మంది ముస్లిం యువకులను అరెస్టు చేసిన కేసుతో పోలుస్తూ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘X’ పై తీవ్రంగా స్పందించారు.

వారు చికెన్ బిర్యానీ తిని, చెత్తను పారవేసి, హిందూ మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో వారిపై దోపిడీతో సహా పలు అభియోగాలు మోపారు. బెయిల్ కూడా నిరాకరించడంతో యువకులు జైలులోనే ఉన్నారు.

ఈ పక్షపాత వైఖరిని ఒవైసీ ప్రశ్నించారు: “ మద్యం సేవించడానికి అనుమతి ఉందా? ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయదా? ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయదా? ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించదా? ఇది జల చట్టాన్ని ఉల్లంఘించదా? మరి అధికార పార్టీ ఫిర్యాదు కూడా చేయదా? 14 మంది ముస్లిం యువకులు ఇప్పటికీ జైలులోనే ఉన్నారని ఆయన రాసుకొచ్చారు.”

గంగానదిపై కార్యకలాపాల విషయంలో చట్టాన్ని విభిన్నంగా అమలు చేయడంపై వచ్చిన స్పందనలు ఒక చర్చను రాజేశాయి. ప్రజా శాంతిభద్రతలను కాపాడటానికి ప్రస్తుత కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. వారణాసిలోని పవిత్ర నది చుట్టూ నెలకొన్న సున్నితమైన అంశాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.