Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జర్నలిస్టుల నోరుమూయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది… అఖిలేష్‌ యాదవ్‌!

Share It:

లక్నో: ఓ పత్రికా సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నించినందుకు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒక “నిజాయితీగల మహిళా జర్నలిస్టు”ను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

జర్నలిస్టులు ‘మౌన శ్రోతలుగా’ (Silent Listeners) ఉండాలని బీజేపీ కోరుకుంటోందని అఖిలేష్ తీవ్రంగా విమర్శించారు. “‘నారీ వందనం’, ‘స్వతంత్ర జర్నలిజం’ రెండింటికీ సవాలుగా నిలుస్తున్న ఉత్తర ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం, యంత్రాంగం, కేవలం ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న అడగాలనుకున్నందుకే ఒక నిజాయితీగల మహిళా జర్నలిస్టు ప్రాణాల మీదకు వచ్చిందని” అఖిలేష్‌ యాదవ్ అన్నారు.

జర్నలిస్టులను మౌనంగా ఉంచాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన ఆరోపించారు, ఈ విషయాన్ని జర్నలిస్టుల సంఘాలు, మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాలని కోరారు.

“నిరంకుశత్వాన్ని, బంధుప్రీతిని సవాలు చేసే ధైర్యవంతమైన పాత్రికేయ వాణిని ఇకపై అణచివేయలేరని” అఖిలేష్‌ యాదవ్ అన్నారు. ఈ ఘటన “తీవ్రంగా ఖండించదగినది”గా ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర జర్నలిజాన్ని, మహిళా గౌరవాన్ని అణచివేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. నిరంకుశత్వాన్ని ప్రశ్నించే ధైర్యమున్న జర్నలిస్టుల గొంతును ఎవరూ నొక్కలేరని అన్నారు.

జర్నలిస్ట్ దివ్య శ్రీవాస్తవ ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ… తాను యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించడానికి ప్రయత్నించగా, బీజేపీ కార్యాలయం వద్ద తనను చుట్టుముట్టారని చెప్పారు. పదేపదే బెదిరించారు, నా ఇంటికి బుల్డోజర్ పంపుతామని చెప్పారని ఆమె అన్నారు.

ఈ ఘటన తర్వాత తాను పనిచేస్తున్న ఛానల్ తనను తొలగించిందని కూడా శ్రీవాస్తవ ఆరోపించారు. “నేను ఇప్పుడు ఎక్కడా లేను. నాకు చాలా భయంగా ఉంది,” అని ఆమె అన్నారు. ఛానల్‌తో మాట్లాడుతూ కన్నీళ్లతో కనిపించిన ఈ జర్నలిస్ట్, “బీజేపీ ట్రోల్స్” తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వ హయాంలో పత్రికా సమావేశాలు సంభాషణలా కాకుండా ‘ఏకపక్ష ప్రసంగం’గా మారిపోయాయని విమర్శించిన ఒక రోజు తర్వాత అఖిలేష్‌ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జర్నలిస్టులు కేవలం ప్రకటనలు మాత్రమే వినాలని, ప్రశ్నలు అడగడానికి అనుమతించకూడదని అనుకుంటే, అటువంటి కార్యక్రమాలను పత్రికా సమావేశాలు అనకుండా ‘పత్రికా ఏకపక్ష ప్రసంగాలు’ అని పిలవాలని ఆయన అన్నారు.

కాగా, శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో కలిసి యోగి ఆదిత్యనాథ్ ఒక పత్రికా సమావేశంలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ విలేకరుల సమావేశం నుంచి వెళ్తుండగా, శ్రీవాస్తవ ఆయన్ను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిలేష్‌ ‘X’లో షేర్‌ చేసారు. ఆ వీడియోలో, ఆ జర్నలిస్ట్ తన వాదనను వివరిస్తూ, తాను కూడా ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించానని చెబుతున్నట్లుగా కనిపిస్తుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.