జెరూసలేం: ఇజ్రాయెల్తో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఉగ్రవాద సంస్థ చివరిగా విడుదల చేసిన షెడ్యూల్లో భాగంగా శనివారం హమాస్ ఆరుగురు ఇజ్రాయెలీయులను విడిపించారు.
మొత్తం మీద, ఈ దశలో మొత్తం 33 మంది ఇజ్రాయెలీయులను విడుదల చేస్తున్నారు – వారిలో ఎనిమిది మంది మరణించారు. ఐదుగురు థాయ్ బందీలను కూడా విడిగా విడుదల చేశారు. 2014 నుండి నిర్బంధించిన సైనికుడి మృతదేహంతో సహా అరవై మూడు మంది బందీలు గాజాలోనే ఉన్నారు.
హమాస్ ఉగ్రవాదులు అపహరించిన ఇద్దరు చిన్న పిల్లల ఇజ్రాయెలీ తల్లి షిరి బిబాస్ మృతదేహాన్ని అప్పగించగా… ఉద్రిక్త ప్రతిష్టంభన తర్వాత, ఆమె అవశేషాలను శనివారం తెల్లవారుజామున తిరిగి ఇచ్చి గుర్తించారు. రాబోయే రోజుల్లో చివరి నాలుగు సెట్ల అవశేషాలను తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.
హమాస్ నేతృత్వంలోని తీవ్రవాదులు అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో 251 మందిని అపహరించారు, ఇది యుద్ధానికి దారితీసింది. గాజాలో 48,000 మందికి పైగా పాలస్తీనియన్లు, ఎక్కువగా మహిళలు, పిల్లలు సంఘర్షణలో మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ మొదటి దశలో బందీలకు బదులుగా దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేస్తోంది.
2023 అక్టోబర్ 7న అదుపులోకి తీసుకున్న బందీల వివరాలు :
మొత్తం పట్టుబడినవారు: 251
మార్పిడి లేదా ఇతర ఒప్పందాల ద్వారా విడుదల చేయబడిన బందీలు: 141, వీరిలో 4 మంది మరణించారు
ఇప్పటికీ ఉన్న బందీలుగా ఉన్నవారు : 62, వీరిలో ఇజ్రాయెల్ 35 మంది మరణించినట్లు ప్రకటించింది
బందీలలో ఉన్న సైనికులు: 13, వీరిలో ఇజ్రాయెల్ 7 గురు మరణించినట్లు ప్రకటించింది
ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్న బందీల మృతదేహాలు: 40
సజీవంగా రక్షించిన బందీలు: 8
ఇప్పటికీ బందీలలో ఉన్నవాళ్లలో ఇజ్రాయేలీలు కానివారు: 5 మంది
వీరిలో (ముగ్గురు థాయ్లు, 1 నేపాలీ, 1 టాంజానియన్), వీరిలో ఇద్దరు (1 థాయ్, 1నేపాలీ) ఇప్పటికీ బతికే ఉన్నారని నమ్ముతారు.
కాగా, ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas) ల మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. తమ చెరలోని ఇజ్రాయెల్ దేశీయుల మృతదేహాలను అప్పగించేందుకు హమాస్.. వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు టెల్అవీవ్లు అంగీకరించాయని ఇరువర్గాల అధికారులు తెలిపారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని రోజులు ఉండొచ్చని చెబుతున్నారు.