Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ప్రైవేట్ పాఠశాలల వార్షిక ఫీజులను 15 శాతం పెంచాలని ప్రతిపాదించిన ‘ట్రెస్మా’ !

Share It:

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు ఏటా 15 శాతం ఫీజు పెంపుతో పాటు ఫీజు ఎగవేతదారుల నిర్వహణకు మార్గదర్శకాలను ప్రతిపాదించాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రతిపాదనలు చేసింది.

తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA ప్రతిపాదనల ప్రకారం, పాఠశాలలు 15 శాతానికి మించి ఫీజులను పెంచాల్సిన అవసరం ఉంటే ఫీజు నియంత్రణ కమిటీ నుండి అనుమతి పొందాలి. తెలంగాణలోని ఏ పాఠశాల కూడా విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేయకుండా ఉండేలా ఫీజు నియంత్రణ ఉండాలని సంఘం అధ్యక్షులు సాదుల మధుసూధన్ కూడా అంగీకరించారు.

ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో 10-20 శాతం మంది విద్యార్థులు ఫీజులు చెల్లించడంలో డిఫాల్ట్ అవుతారని TRSMA గౌరవాధ్యక్షుడు ఎస్ శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రాయితీల కోసం రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల సిఫార్సులు పాఠశాలలకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

ఫీజుల వర్గీకరణ
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నిర్మాణాన్ని వర్గీకరించాలని TRSMA సూచించింది. ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్‌లకు ప్రత్యేక స్లాబ్‌లను ప్రతిపాదించింది. అంతేకాదు సంవత్సరానికి రూ. 55,000 కంటే తక్కువ వసూలు చేసే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది.

అనేక విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం ఫీజులను గణనీయంగా పెంచుతున్నందున, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో ఫీజు నియంత్రణను డిమాండ్ చేస్తున్నారు. అయితే అధిక ఫీజులతో బాధపడుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎలా ఉపశమనం కలిగిస్తుందో వేచి చూడాలి.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.