Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌…తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఘనవిజయం!

Share It:

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. రాజస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 44పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు… రాయల్స్‌ ఆటగాళ్లు సంజు సామ్సన్, ధ్రువ్ జురెల్ వీరోచిత ప్రయత్నాలను అడ్డుకున్నాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనింగ్‌ జోడీ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మతో కలిసి 31 బంతుల్లో 67 పరుగులు జోడించి మొదటి వికెట్‌ భాగస్వామ్యానికి 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత, కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్) కొత్త ఫ్రాంచైజీ తరపున తన తొలి ప్రదర్శనలో 45 బంతుల్లో 100 పరుగులు చేశాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లకు 286 పరుగులు చేసింది, ఇది IPL చరిత్రలో వారి రెండవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

కానీ రాయల్స్‌ మాత్రం పరుగుల వేటలో వెనకపడింది. హైదరాబాద్ నిర్దేశించిన 287 పరుగులు భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) సమత్ సింగ్ తక్కువ స్కోరుకే పెవీలియన్ పంపించాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ (4) ఒత్తిడిని జయించలేక వికెట్ పారేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రాణా (11) కూడా విఫలమవడంతో రాజస్థాన్ జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ సంజూ శామ్సన్‌, ధృవ్‌జురెల్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సులు బాదుతూ రాజస్థాన్ రన్‌రేట్ తగ్గకుండా పరుగులు సాధించారు. ఈ జోడీ నాలుగో వికెట్ కు ఏకంగా 111 పరుగులు చేసింది.

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని హర్షల్ పటేల్ విడదీశారు. సంజూ శాంసన్ (66)ను పటేల్ పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే దృవ్‌ జురెల్‌ (70) కూడా ఔటయ్యాడు. ఒక వైపు కావల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో హెట్‌ మెయర్ (12), శివమ్‌ దూబే (34) ధాటిగా ఆడినా జట్టును కాపాడలేక పోయారు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల ఇష్టానికి 242 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్‌ 44 పరుగులతో విజయం సాధించింది. సిమర్‌జీత్‌సింగ్‌, హర్షల్‌పటేల్‌ తలా రెంకు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా చెరో వికెట్ తీశారు. అధ్భుతమైన సెంచరీ చేసిన ఇషాన్‌కు ప్లేయర్ ఆఫ్ & మ్యా అవార్డు లభించింది.

కాగా, అనుభవంలేని రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్లాట్‌ వికెట్‌పై బౌలింగ్‌ను ఎంచుకోవడం పెద్ద పొరబాటు నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం టోర్నమెంట్ చివరిలో వారిని వెంటాడవచ్చు.

SRH గత సీజన్‌ను ఎక్కడ నుండి వదిలిపెట్టిందో అక్కడి నుండి ప్రారంభించింది. IPL అత్యుత్తమ స్కోరు (287/3) ను మెరుగుపరుచుకునేది, కానీ చివరి ఓవర్‌లో రెండు వికెట్లు పడిపోయాయి. నాలుగు ఓవర్లలో వికెట్లు తీసుకోకుండా 76 పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, టోర్నమెంట్ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.

గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాళ్ళలో ఒకరైన కిషన్, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారారు. ఆరంగ్రేటంలోనే ఇరగదీశాడు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.