Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఏప్రిల్‌ 5లోగా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి..మైనారిటీ యువతను ప్రోత్సహిస్తున్న కమ్యూనిటీ నాయకులు!

Share It:

హైదరాబాద్‌ : నిరుద్యోగ ముస్లిం యువత వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ యువతను కమ్యూనిటీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద మైనారిటీల కోసం రూ. 840 కోట్లు కేటాయించింది, జనాభా అంచనాల ఆధారంగా ముస్లిం దరఖాస్తుదారులకు రూ. 751 కోట్లు కేటాయించింది. తెలంగాణ అంతటా దాదాపు 42,000 మంది మైనారిటీ యువత ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

అయితే ఈ పథకానికి మైనారిటీ దరఖాస్తుదారుల నుండి స్పందన నెమ్మదిగా ఉంది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకారం, ఇప్పటివరకు 12,000 దరఖాస్తులు మాత్రమే సమర్పించారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 5గా నిర్ణయించడంతో, అధికారులు ముస్లివ యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఆయా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల సిఫార్సుల ఆధారంగా తుది ఆమోదంతో ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

తెలంగాణ స్వయం ఉపాధి పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానించారు.
ఈ పథకం నాలుగు రకాల సబ్సిడీ ఆధారిత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది:

  • రూ.50 వేల సహాయం – వంద శాతం సబ్సిడీ
  • రూ.లక్ష సాయం- 90% సబ్సిడి, 10% బ్యాంకు రుణం
  • రూ. రెండు లక్షల సాయం-80% సబ్సిడీ
  • రూ. 4 లక్షల సాయం-70% సబ్సిడీ

అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారులు ఆదాయ అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి: గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఆదాయం ఉండాలి.

పట్టణ దరఖాస్తుదారులకు వయోపరిమితి 21 నుండి 55 సంవత్సరాలు, గ్రామీణ దరఖాస్తుదారులకు 21 నుండి 60 సంవత్సరాలు. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాకే ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయడానికి, ప్రభుత్వం రేషన్ కార్డ్ అవసరాన్ని తొలగించింది. ఇప్పుడు రూ.1 లక్ష వరకు ఆదాయ ధృవీకరణ పత్రాలను అనుమతిస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్, ఇతర జిల్లాల నుండి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆందోళన కలిగిస్తుంది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.