డీర్ అల్-బలా: ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. నెల రోజులగా గాజా స్ట్రిప్కు ఎలాంటి దిగుమతులను అనుమతించకపోవడంతో ఆహార సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ తన బేకరీలన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హమాస్ తమ కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను అంగీకరించమని ఒత్తిడి చేసేందుకు ఇజ్రాయెల్ తన దిగ్బంధనను కఠినతరం చేసింది. ఆ తరువాత బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఆరు వారాల కాల్పుల విరమణ సమయంలో గాజాలోని దాదాపు 2 మిలియన్ల పాలస్తీనియన్ల ఆకలి తీర్చేందుకు తగినంత ఆహారం ఉంది.
అయితే వారం క్రితం మార్కెట్లు ఖాళీ అయ్యాయి.యుద్ధ విరమణ సమయంలో వారు తరలించిన ఆహార సామాగ్రి అయిపోతోందని ఐక్యరాజ్యసమితి సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనా ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని నాశనం అయినందున గాజా అంతర్జాతీయ సహాయంపై ఎక్కువగా ఆధారపడుతోంది.
తన ఇంట్లో 12 మంది పిల్లలు భోజనం లేకుండా పడుకుంటున్నారని తండ్రి అయిన మొహమ్మద్ అల్-కుర్ద్ మీడియాతో వాపోయారు. “మేము వారికి ఓపికగా ఉండమని, ఉదయం పిండి తీసుకువస్తామని చెబుతున్నాము”. “మేము వారికి అబద్ధం చెబుతామని ఆయన అన్నారు.”
సోమవారం సహాయ బృందాలకు పంపిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మెమోలో, పిటా బ్రెడ్ను ఉత్పత్తి చేసే బేకరీలను ఇకపై నిర్వహించలేమని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ పేర్కొంది. అత్యవసర ఆహార సహాయం అందించేందుకు వీలుగా మిగిలిన నిల్వలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు UN ఏజెన్సీ తెలిపింది.
ఈ మేరకు UN ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రతినిధి ఓల్గా చెరెవ్కో మాట్లాడుతూ… WFP గత నెలలో ఆరు బేకరీలను మూసివేసిన తర్వాత దాని మిగిలిన 19 బేకరీలను తాజాగా మూసివేస్తోందని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు వాటిపై ఆధారపడ్డారని ఆమె చెప్పారు.
COGAT అని పిలువబడే పాలస్తీనా వ్యవహారాల బాధ్యత కలిగిన ఇజ్రాయెల్ సైనిక సంస్థ, కాల్పుల విరమణ సమయంలో 25,000 కంటే ఎక్కువ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయని, దాదాపు 450,000 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని తెలిపింది.
జనవరిలో కాల్పుల విరమణ ప్రారంభమయ్యే ముందు సహాయాన్ని తీసుకురావడానికి,పంపిణీ చేయడానికి తాము ఇబ్బంది పడ్డామని UN ఏజెన్సీలు,సహాయ బృందాలు చెబుతున్నాయి. సరిహద్దు క్రాసింగ్ల ద్వారా ఎంత సహాయం ప్రవేశించిందో ఆధారంగా గాజాలో ప్రజలకు ఎంత సహాయం చేరిందో వారి అంచనాలు COGAT కంటే తక్కువగా ఉన్నాయి.
2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి, 251 మందిని బందీలుగా తీసుకొచ్చాక యుద్ధం ప్రారంభమైంది. మిగిలిన వారిలో ఎక్కువ మందిని కాల్పుల విరమణ ఒప్పందాల ద్వారా విడుదల చేసిన తర్వాత కూడా హమాస్ ఇప్పటికీ 59 మంది బందీలను (వీరిలో 24 మంది బతికే ఉన్నారని భావిస్తున్నారు) ఉంచుకుంది.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడిలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు, వీరిలో కాల్పుల విరమణ ముగిసినప్పటి నుండి వందలాది మంది దాడుల్లో మరణించారు, యుద్ధంలో మరణించినవారు పౌరులా లేదా పోరాట యోధులా అని చెప్పలేదు. ఇజ్రాయెల్ దాదాపు 20,000 మంది ఉగ్రవాదులను చంపినట్లు ఆధారాలు అందించకుండానే చెబుతోంది.
యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ గాజాకు అన్ని సహాయాలను అందించకుండా నిలిపివేసింది, కానీ తరువాత వాషింగ్టన్ ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గింది. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయం చేసినందుకు క్రెడిట్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇజ్రాయెల్ చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది.
యుద్ధాన్ని ముగించడంపై చర్చలు ప్రారంభించే ముందు హమాస్ అనేక మంది బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది, ఫిబ్రవరి ప్రారంభంలో చర్చలు ప్రారంభమయ్యాయని భావిస్తున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా హమాస్ తన ఆయుధాలు వదిలేసి గాజాను విడిచిపెట్టాలని కూడా ఇజ్రాయెల్ పట్టుబట్టింది.
అయితే హమాస్ ఒప్పందాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది, దీనిలో ఎక్కువ మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి బదులుగా మిగిలిన బందీలను విడుదల చేస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ శాశ్వత కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని హమాస్ కోరింది.