24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాహుల్ గాంధీ-ఈడీ విచారణ… కాంగ్రెస్ శ్రేణుల నిరసన!

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ  ఈడీ విచారణ నిన్నటికి ముగిసింది. నేడు మరోసారి విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపింది. నిన్న దాదాపు పది గంటల పాటు రాహుల్‌నుప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. దీనికి సంబంధించి రాహుల్ వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానాలను తీసుకుంది. రాహుల్ ఇచ్చిన సమాధానాలనే వ్యక్తిగత ఒప్పుకోలును సాక్ష్యాలుగా పరిగణించనుంది ఈడీ. ఉదయం మూడు గంటలు , సాయంత్రం ఐదున్నర గంటలు మొత్తం ఎనిమిదిన్నదర గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ లంచ్ బ్రేక్ నిమిత్తం 2.30 గంటలకు ముగిసింది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగిసింది.

మరోవైపు, రాహుల్ని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దిల్లీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే నిరసనలకు చేపట్టాయి. ఆయనకు సంఘీభావంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వీధుల్లో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, ఢిల్లీలో ఆందోళనలకు అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు.

పోలీసుల చర్యపై కాంగ్రెస్ మండిపాటు
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు పార్టీ సీనియర్ నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి ఎడమ వైపు పక్కటెముక ప్రాక్చర్ అయినట్లు ఏఐసీసీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ‘పోలీసుల తోపులాటలో మాజీ హోం మంత్రి పి. చిదంబరం కళ్లద్దాలు కిందపడిపోయాయి. ఆయన ఎడమ వైపు పక్కటెముక చిన్నగా ప్రాక్చర్ అయ్యింది. ఎంపీ ప్రమోద్ తివారీ రోడ్డుపై పడిపోయారు. ఆయన తలకు గాయమైంది. పక్కటెముకపై చిన్నగా క్రాక్ వచ్చింది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?’ అంటూ మోదీ ప్రభుత్వాన్ని సుర్జేవాలా ప్రశ్నించారు.

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యం…
సుమారు 2000 కోట్ల విలువైన అసెట్స్‌ ఈక్విటీ ట్రాన్సాక్షన్‌లో అవకతవకలకు సంబంధించినదే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుదఫాలుగా సొమ్ము అందించింది. సుమారు రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.

అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైంది. ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. అనంతరం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ వ్యవహారంపై ఆరోపణలు సంధించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా అధీనం చేసుకుందని కంప్లైంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బాకీపడ్డ సుమారు రూ. 89.5 కోట్లు రద్దు అయినట్టు స్వామి ఆరోపించారు. తద్వార ఆ సొమ్ము అంతా వీరు పొందారని (మనీలాండరింగ్?) సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు.

2016 నుంచి ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌, పలువురు కాంగ్రెస్ లీడర్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం చారిటీ కోసం స్థాపించిన ఎన్జీవో సంస్థ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్ అని, ఫైనాన్షియల్ కాదని పేర్కొంటున్నది. అసలు ఆస్తులు లేదా నగదు అనేది బదిలీనే కాలేదుని, అలాంటప్పడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles