రియాద్ : అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ పర్యటనకు విచ్చేశారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక చేసిన తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఎయిర్ ఫోర్స్ వన్ నుండి బయటకు వచ్చిన ట్రంప్కు, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు, సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు.
ట్రంప్ గల్ఫ్ పర్యటనలో ప్రధానంగా వ్యాపార ఒప్పందాలపై దృష్టి పెట్టారు. తరువాత ఆయన రియాద్లో అధ్యక్షుడితో ఇంధనం, రక్షణ, మైనింగ్, ఇతర రంగాలపై ఒక ఒప్పందంపై సంతకం చేశారు. సౌదీ అరేబియా, అమెరికా వాణిజ్యంలో $600 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
సౌదీ అరేబియా పెట్టుబడిలో భాగంగా మిత్రదేశాల మధ్య అతిపెద్ద రక్షణ అమ్మకాల ఒప్పందం $142 బిలియన్ల విలువైనది కూడా ఉంది. రానున్న ఏప్రిల్లోగా అమెరికా $100 బిలియన్లకు పైగా విలువైన ఆయుధ ప్యాకేజీని అందించడానికి సిద్ధంగా ఉందని రాయిటర్స్ నివేదించింది.
“మనం ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నామని నేను నిజంగా నమ్ముతున్నాను” అని సౌదీ అరేబియా పాలకుడు క్రౌన్ ప్రిన్స్తో జరిగిన సమావేశంలో ట్రంప్ అన్నారు.
రియాద్ US F-35 జెట్లు,ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని యత్నిస్తోంది. ఈ అంశంపై అమెరికా, సౌదీ అరేబియా చర్చించాయి. చర్చల గురించి వివరించిన రెండు వర్గాలు రాయిటర్స్తో మాట్లాడుతూ… సౌదీ చాలా కాలంగా ఆసక్తి చూపుతున్న సైనిక విమానం గురించి ప్రస్తావించాయి. అయితే మంగళవారం ప్రకటించిన ఒప్పందంలో ఆ విమానాలు ఉన్నాయో లేదో వెంటనే స్పష్టంగా తెలియలేదు.
బిలియనీర్ ఎలోన్ మస్క్తో సహా అమెరికా వ్యాపార నాయకులతో కలిసి ఉన్న ట్రంప్ బుధవారం రియాద్ నుండి ఖతార్కు, గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళతారు. మద్య ప్రాశ్చ్య పర్యటనలో భాగంగా వచ్చిన ట్రంప్ ఇజ్రాయెల్లో ఆగలేదు. ఈ నిర్ణయం వాషింగ్టన్ ప్రాధాన్యతలలో సన్నిహిత మిత్రుడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నలను లేవనెత్తింది. ఈ పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా మధ్యప్రాచ్యంలో భద్రతా విషయాల కంటే పెట్టుబడిపైనే దృష్టి పెట్టారు.
ట్రంప్… సౌదీ యువరాజును మిత్రుడిగా అభివర్ణించారు. ఇరుదేశాల మధ్య మంచి సంబంధం ఉందని ట్రంప్ అన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నుండి వచ్చిన పూల్ నివేదిక ప్రకారం… సౌదీ పెట్టుబడి USలో ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
కాగా, అధ్యక్షుడు ట్రంప్ నాలుగు రోజుల పాటు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సౌదీ, యూఏఈ, ఖతార్ను సందర్శించనున్నారు. మరోవైపు ట్రంప్ కోసం సౌదీ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు పలు కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. అమెజాన్, ఉబర్, గూగుల్, బోయింగ్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ సీఈవోలతోపాటు టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కూడా హాజరుకానున్నారు. ఇక ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ కూడా పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు.
మొత్తంగా సౌదీ అరేబియా, అమెరికా దశాబ్దాలుగా బలమైన సంబంధాలను కొనసాగించాయి. ఇందులో భాగంగా సౌదీ అరేబియా చమురును సరఫరా చేస్తుంది. అందుకు బదులుగా సూపర్ పవర్ భద్రతను అందిస్తుంది