లండన్: రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముష్తాక్ ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత్రి ఆమె. “హార్ట్ ల్యాంప్” అనే కథా సంకలనానికి ఈ అవార్డును అందుకున్నారు. మంగళవారం లండన్ లో అవార్డును ప్రకటించారు. ఈ బహుమతితో పాటు…. 50 వేల పౌండ్లను ప్రైజ్ మనీగా అందిస్తారు. బాను ముష్తాక్, దీపా భస్తి ప్రైజ్ మనీని సమానంగా పంచుకోనున్నారు .
ముష్తాక్ తన విజయాన్ని వైవిధ్యానికి విజయంగా అభివర్ణించారు, ఆమె అనువాదకురాలు దీపా భస్తితో కలిసి టేట్ మోడరన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బహుమతిని అందుకున్నారు, ఈ పుస్తకాన్ని దీపా భస్తి కన్నడ నుండి ఆంగ్లంలోకి అనువదించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరు పుస్తకాలలో షార్ట్లిస్ట్ చేయగా, అందులో హార్ట్ల్యాంప్లో ముష్తాక్ రచన, కుటుంబం, సమాజం, హృదయాన్ని కదిలించే, ఉత్తేజపరిచే” శైలికి న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. “ఈ పుస్తకం ఏ కథ కూడా ఎప్పుడూ చిన్నది కాదని, మానవ అనుభవాల సారం నుంచి పుట్టింది” అని ముష్తాక్ అన్నారు.
“మనల్ని విభజించడానికి తరచుగా ప్రయత్నించే ప్రపంచంలో, సాహిత్యం అనేది ఒకరి మనస్సులలో ఒకరు జీవించగలిగే పవిత్ర స్థలాలలో ఒకటిగా మిగిలిపోయింది కొన్ని పేజీలు మాత్రమే” అని ఆమె అన్నారు. “ఈ క్షణం వేల కొద్దీ మిణుగురు పురుగులు ఒక్కసారిగా ఆకాశాన్ని వెలిగించినట్లు ఉంది. చిన్నది. మెరిసేది. పూర్తిగా అందరిదీ” బానూ ముస్తాక్ వ్యాఖ్యానించారు. “ఈ గొప్ప గౌరవాన్ని నేను ఒక వ్యక్తిగా తీసుకోవట్లేదు, ఎంతో మందితో కలిసి వినిపించిన ఒక గొంతుకగా స్వీకరిస్తున్నాను” అని బానూ చెప్పారు.
దీపా భాస్తి మాట్లాడుతూ, “నా అందమైన భాషకు ఇది ఎంత గొప్ప విజయం” అని అన్నారు. ఆమె అంతర్జాతీయ బుకర్ గెలిచిన మొదటి భారతీయ అనువాదకురాలు అయ్యారు.
జ్యూరీ ఛైర్ మాక్స్ పోర్టర్ మాట్లాడుతూ” “హార్ట్ ల్యాంప్’ ఇంగ్లీష్ పాఠకులకు నిజంగా కొత్త అనుభవం. ఇది భాషను సవాల్ చేస్తూ, వివిధ రకాల భాషల్లో కొత్త భావనలను సృష్టించే ఒక గొప్ప అనువాదం. ఈ అందమైన, చురుకైన, జీవితాన్ని ధృవీకరించే కథలు కన్నడ నుండి పుట్టాయి. వాటిలో మాండలికాల సామాజిక-రాజకీయ గొప్పదనం ఉంది. ఇది మహిళల జీవితాలు, పునరుత్పత్తి హక్కులు, విశ్వాసం, కులం, అధికారం, అణచివేత గురించి మాట్లాడుతుంది..” అని పేర్కొన్నారు.
కాగా, 2022లో గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్ మొట్టమొదటి హిందీ నవల ‘టోంబ్ ఆఫ్ సాండ్’ ప్రతిష్టాత్మక బుకర్ బహుమతిని గెలుచుకున్నారు. పెరుమాళ్ మురుగన్ రాసిన తమిళ నవల ‘పైర్’ని అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి అనువదించారు. 2023లో లాంగ్లిస్ట్లోకి వచ్చింది.


