Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మణిపూర్‌లో మైతీల నిరసన సందర్భంగా టియర్ గ్యాస్ ప్రయోగం…హోంశాఖ అధికారులను కలవనున్న మెయిటీ సంస్థ!

Share It:

గౌహతి: ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్‌లో మళ్లీ అలజడి రేగింది. మైతీల నిరసన సందర్భంగా రాజ్ భవన్‌లోకి చొరబడటానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మెయిటీ సంస్థ COCOMIకి చెందిన నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి.

మణిపూర్ ఐక్యతపై సమన్వయ కమిటీ (COCOMI) “సహకార నిరాకరణ ఉద్యమం” ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ నిరసన జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీ సంస్థ సభ్యులు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రధాన కార్యదర్శి, DGP, మణిపూర్ కేంద్ర భద్రతా సలహాదారు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

మణిపూర్ రాష్ట్ర రవాణా బస్సుపై “మణిపూర్” అని రాసి ఉన్న బోర్డును తొలగించమని కేంద్ర భద్రతా దళాలు జర్నలిస్టుల బృందాన్ని కోరిన ఘటనకు నిరసనగా కమిటీ ఆందోళనను ప్రారంభించింది. నాగ ప్రాబల్యం ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని శిరుయ్ లిల్లీ ఫెస్టివల్‌కు బస్సు జర్నలిస్టులను తీసుకువెళుతోంది. దీనిపై ఇంఫాల్‌లోని జర్నలిస్టులు కూడా నిరసన తెలిపారు. ఆ తరువాత గవర్నర్ భల్లా ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. కానీ COCOMI గవర్నర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

నిన్న మణిపూర్ ఐక్యతపై సమన్వయ కమిటీ (COCOMI) సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, రాజ్ భవన్ ముందు, మరికొన్ని ప్రదేశాలలో గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్ భవన్‌లోకి చొరబడటానికి అనేక మంది ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు టియర్ గ్యాస్ కాల్పులు జరిపారు. ఖురైజామ్ COCOMI కన్వీనర్ అథౌబా ఇంఫాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ…భద్రతా దళాల చర్య కారణంగా అనేక మంది మహిళలు గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థిత విషమంగా ఉందని అన్నారు

హోంశాఖ అధికారులతో సమావేశం

ఉద్రిక్తత మధ్య, అథౌబా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల COCOMI ప్రతినిధి బృందం మంగళవారం హోం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం కోసం న్యూఢిల్లీకి బయలుదేరింది. COCOMI బృందం మైతీ, కుకీ కమ్యూనిటీ మధ్య కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే మార్గాలను సూచిస్తుందని అథౌబా చెప్పారు.

కుకీ తిరుగుబాటు గ్రూపులతో ఆపరేషన్ సస్పెన్షన్ (SoO) ఒప్పందాన్ని రద్దు చేయాలని, సంఘర్షణను ముగించడానికి “చిన్ కుకీ ఉగ్రవాదులపై” కఠిన చర్యలు తీసుకోవాలని COCOMI డిమాండ్ చేస్తోంది. అయితే, కుకీ గ్రూపులతో చర్చలు జరపడానికి తాము ఇప్పటికీ వ్యతిరేకమని అథౌబా చెప్పారు. “మా చర్చలు మాకు, కేంద్రానికి మధ్య మాత్రమే” అని ఆయన అన్నారు.

కుకీల వైఖరి

10 మంది కుకీ-జో ఎమ్మెల్యేలు సహా కుకీ సంస్థలు, తదుపరి చర్చలు జరపబోమని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. మే 2023 నుండి మణిపూర్‌లోని కుకి-జో కమ్యూనిటీలకు మెయిటీలతో వివాదాన్ని ముగించడానికి కుకి గ్రూపులు “ప్రత్యేక పరిపాలన”ను డిమాండ్ చేస్తున్నాయి.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.