హైదరాబాద్: క్యాంపస్లలో ‘ఫ్రీ పాలస్తీనా’కు మద్దతు పెరుగుతోంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, విద్యార్థుల మెదళ్లను ఉత్తేజపరిచేందుకు ఒక విద్యార్థి సంస్థ ఒక వినూత్న మార్గాన్ని రూపొందించింది.
నిన్న ఉస్మానియా క్యాంపస్ లోపల వివిధ ప్రదేశాలలో ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, గాజా మానవతా సంక్షోభం, నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ గురించి సమాచారాన్ని అందించే పోస్టర్లు కనిపించాయి.
“స్పార్క్ జూలై 2025” అనే శీర్షికతో ఉన్న ఈ పోస్టర్లలో, ట్రంప్ తన నోటితో పక్షిని పట్టుకుని, తన నోబెల్ బహుమతి ఎక్కడ ఉందో ఆలోచిస్తున్న కార్టూన్ కనిపిస్తుంది.
మరో కార్టూన్లో, ఒక భారతీయ ఓటరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చినట్లు రూ. 15 లక్షలు చెల్లిస్తే తాను ఖచ్చితంగా మోడీకి ఓటు వేస్తానని చెప్పడం చూడవచ్చు. ఆ డబ్బును మన ఖాతాలో వేయడం ఏమోగానీ, “స్విస్ బ్యాంకుల్లోని భారతీయ డబ్బు 2024లో మూడు రెట్లు పెరుగుతుంది” అని పేర్కొన్న వార్తాపత్రిక కథనాన్ని ఓటరు మోడీకి చూపిస్తాడు.
“నల్లధనం మూడు రెట్లు పెరిగింది సర్,” అని ఓటర్ చెప్పడంతో కార్టూన్లో ఉన్న మోడీ అయోమయంలో పడ్డాడు. పోస్టర్/చార్ట్లో సోవియట్ రష్యన్ రచయిత మాగ్జిమ్ గోర్కీ రాసిన…”విద్యార్థుల జీవితంలో పుస్తకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీవితంలో గొప్ప పనులు చేయడానికి,మన వైఫల్యాలను అధిగమించడానికి అవి మనల్ని ప్రేరేపిస్తాయి అన్న ప్రసిద్ధ కోట్ కూడా ఉంది.
ఓయూ, నిజాం కళాశాల, ఇఫ్లూ EFLU నుండి అంతగా పరిచయంలేని విద్యార్థుల గ్రూపు అయిన దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ప్రతి నెలా ఒక్కో అంశాన్ని తీసుకొని ఈ క్యాంపస్లలో అటువంటి పోస్టర్లను అతికిస్తోంది.