Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

కుల సర్వేపై సమీక్షను ప్రభుత్వానికి సమర్పించిన నిపుణుల కమిటీ!

Share It:

హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024 (SEEECPCS) ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తన సమీక్షను సమర్పించింది. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా, నమ్మదగినదిగా ఉందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యుల నిపుణుల కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 300 పేజీల నివేదికను సమర్పించింది.

బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలుకు ఈ నివేదిక ఉపయోగకరంగా ఉంటుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ జనాభా మధ్య ఉన్న అసమానతలను, వాటి వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీని సీఎం కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాల అమలుకు తగిన సూచనలు అందించాలని కూడా ఆయన కమిటీని కోరారు.అంతేకాకుండా, నివేదిక సూచనలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ కుల సర్వే 2024
అన్ని వర్గాల సామాజిక న్యాయం, సాధికారతను నిర్ధారించే లక్ష్యంతో, రాష్ట్ర జనాభా సామాజిక, ఆర్థిక, కుల డేటాను సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించిని విషయం తెలిసిందే.

ఈ సర్వేను రెండు దశల్లో నిర్వహించారు, మొదటి దశ నవంబర్ 6 నుండి డిసెంబర్ 25, 2024 వరకు నిర్వహించారు. సర్వే కోసం, ప్రతి జిల్లాలోని ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్‌గా ఎంపిక చేశారు. ప్రతి బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు.

ప్రభుత్వం ప్రకారం, మొదటి దశ రాష్ట్రంలోని 96.9 శాతం కుటుంబాలను కవర్ చేసింది. వారి వివరాలను 36 రోజుల్లోపు డేటాబేస్‌లో నమోదు చేశారు. అయితే, మొదటి దశలో తప్పిపోయిన కుటుంబాలకు ఫిబ్రవరి 16 నుండి 28 వరకు రెండవ దశలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

మీ సేవా కేంద్రాలు, GHMC, MPDO కార్యాలయాలు మరియు వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి అనుమతించారు.

సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉండగా, మొత్తం జనాభా 3,55,50,759. వీటిలో 97.10 శాతం ఉన్న 1,12,36,849 కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకున్నాయి.

రాష్ట్రంలో 61,91,294 SCలు (17.42 శాతం), 37,08,408 STలు (10.43 శాతం), 2,00,37,668 BCలు (56.36 శాతం), మరియు 56,13,389 మంది వ్యక్తులు (15.89 శాతం) ఇతర కులాలకు చెందినవారని సర్వే పేర్కొంది.

సర్వే ఫలితాల ద్వారా, ప్రభుత్వం ప్రస్తుత విధానాలను మెరుగుపరచాలని, కొత్త విధానాలను రూపొందించాలని, సామాజిక న్యాయాన్ని పెంపొందించాలని, రాష్ట్రంలోని వెనుకబడిన, బలహీన వర్గాలను ఉద్ధరించాలని ఆశిస్తోంది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.