Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాజీనామా!

Share It:

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం…ఇది తక్షణమే అమలులోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు.

ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో ధంఖర్ పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపించారు. తన పదవి కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన ప్రధాని, మంత్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాదు ప్రధానమంత్రి, మంత్రి మండలి, పార్లమెంటేరియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. “సభ్యుల నుండి నాకు లభించిన అభిమానం, విశ్వాసం, ఆత్మీయత నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్యంలో భాగమయ్యే అరుదైన అనుభవం” అని పేర్కొన్నారు.

“నా పదవీ కాలంలో భారత అభివృద్ధి, ప్రగతిని చూస్తూ అందులో భాగస్వామ్యంగా ఉండడం నా జీవితంలో అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని దేశ చరిత్రలో ఒక మార్పు దశగా చూస్తున్నాను. భారత భవిష్యత్తుపై నాకు అపార విశ్వాసం ఉంది” అని జగదీప్‌ ధన్‌ఖడ్ పేర్కొన్నారు.

రాజీనామాకు సూచనలు కనిపించలేదు
నిన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభంలో, ధంఖర్ తన రాజీనామాకు సంబంధించిన సూచనను కనిపించలేదు. కార్యకలాపాలు ముగిసే ముందు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ తనకు అందిన మోషన్ నోటీసు గురించి ధంఖర్ సభ్యులకు తెలియజేశారు.

ఈ మోషన్‌ నోటీసుపై 50 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారని, న్యాయ శాఖ సహాయ మంత్రి, న్యాయమూర్తి అర్జున్ రామ్ మేఘ్వాల్ 152 మంది లోక్‌సభ ఎంపీలు స్పీకర్‌కు ఒక మోషన్‌పై సంతకం చేశారని ధంఖర్ చెప్పారు.

మరోవంక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ డిసెంబర్‌లో తనకు అందిన ఒక తీర్మానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ధంఖర్ అతని పేరును పేర్కొనకపోయినా, ఆయన జస్టిస్ శేఖర్ యాదవ్‌పై 50 మందికి పైగా ఎంపీలు ఆయన మతపరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అభిశంసన నోటీసుపై సంతకం చేశారని ఆయన ప్రస్తావించారు.

“నేను దానిని పరిశీలించాను. ఒక సభ్యుడు రెండు చోట్ల సంతకం చేసినట్లు కనుగొన్నాను. కాబట్టి తీర్మానం 55 మంది సభ్యుల మద్దతును పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి అది 54 మంది మాత్రమే” అని ధంఖర్ అన్నారు.

సోమవారం ప్రారంభంలో, సభ ప్రారంభంలో ధన్‌ఖర్ సభకు నాయకత్వం వహించి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు చేసిన చర్యలను ప్రశంసించారు. గత నెలలో ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన సభకు సంతాపం తెలిపారు. కాగా, ఈ వర్షాకాల సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ధన్‌ఖర్ కోరారు.

ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాల మొదటి రోజున ధంఖర్ రాజీనామా కలకలం రేపింది. గతంలో కాంగ్రెస్‌, జనతాదళ్‌లో ఉన్న ధన్‌ఖఢ్‌ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2003లో బీజేపీలో చేరారు. ధన్‌ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, అనంతరం 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రతిపక్ష పార్టీలతో తీవ్రంగా విభేదించారు. అయితే పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖ

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.