లండన్: అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ నిన్న లండన్లో UK విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో సమావేశమయ్యారు. తమ ఎజెండాలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దాడి ఉన్నాయని చెప్పారు.
చర్చలకు ముందు విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ…గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించకపోతే పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని సెప్టెంబర్లో బ్రిటన్ తీసుకున్న నిర్ణయం గురించి వాన్స్ మాట్లాడారు. “అక్కడ పనిచేసే ప్రభుత్వం లేకపోవడంతో” ఆ గుర్తింపు అంటే ఏమిటో తనకు ఖచ్చితంగా తెలియదని ఆయన అన్నారు.
గాజా నగరాన్ని ఆక్రమించాలనే ఇజ్రాయెల్ ఉద్దేశంపై ట్రంప్కు ముందస్తు హెచ్చరిక ఇచ్చారా అని అడగ్గా…అలాంటి విషయాల్లోకి తాను వెళ్లనని వాన్స్ అన్నారు. “ఆ ప్రాంతంలో శాంతిని తీసుకురావడం సులభం అయితే, అది ఇప్పటికే జరిగి ఉండేది” అని ఆయన అన్నారు.
రష్యా, ఉక్రెయిన్, అలాగే ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధాలను ముగించడానికి ఉత్తమ మార్గం గురించి చర్చించేందుకు వాషింగ్టన్ -లండన్ మధ్య ఈ సమావేశం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ అమెరికాకు ఉక్కు, అల్యూమినియం ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలకు రావడానికి ప్రయత్నిస్తోంది.
మరోవంక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్లో దాదాపు 3½ సంవత్సరాల యుద్ధాన్ని ముగించేందుకు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలపై దృష్టి సారించినప్పటికీ, యుకె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఇతర యూరోపియన్ నాయకులు యుద్ధాన్ని ముగించడంపై ఉక్రెయిన్ ఏదైనా చర్చలలో భాగం కావాలని నొక్కి చెప్పారు.
ఇదిలాఉండగా సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్…గాజాలో యుద్ధాన్ని ముగించే విధానంపై కూడా విభేదించాయి. ఈ సమావేశం చెవెనింగ్లో జరిగింది.
అయితే ఇరుదేశాల నాయకులు చర్చలకు వెళ్లే ముందు రోడ్డుపై దాదాపు రెండు డజన్ల మంది నిరసనకారులు కనిపించారు. కొందరు కెఫియే స్కార్ఫ్లు ధరించగా, మరొకరు వాన్స్ను ఎగతాళి చేస్తూ ముద్రించిన మీమ్ ఉన్న గుండ్రని బోర్డును పట్టుకున్నారు.