Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గాజాలో 25 మంది సహాయక సిబ్బందిని చంపిన ఇజ్రాయెల్!

Share It:

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ దేశం జరిపిన కాల్పుల్లో 25 మంది సహాయ సిబ్బంది మరణించారని ఆరోగ్య అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలను అందుకున్న నాజర్, అవ్దా ఆసుపత్రుల సాక్షులు, సిబ్బంది, సహాయం పంపిణీ కేంద్రాలకు వెళ్లే సమయంలో లేదా గాజాలోకి ప్రవేశించే కాన్వాయ్‌ల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాల్చి చంపారని చెప్పారు. వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేదు.

మరోవంక ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ… ఈ ప్రాంతంపై సైనికదాడి సమయంలో ఇక్కడి నుంచి పాలస్తీనియన్లను వదిలి వెళ్ళడానికి “అనుమతిస్తాము” అని అన్నారు. గాజాలోని 2 మిలియన్లకు పైగా జనాభాలో ఎక్కువ భాగాన్ని “స్వచ్ఛంద వలస” ద్వారా తరలించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనను నెతన్యాహు అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

“యుద్ధ ప్రాంతాలనుండి వారికి వెళ్లిపోవడానికి అవకాశం ఇవ్వండి! అని నెతన్యాహు … ఇజ్రాయెల్ టీవీ స్టేషన్ i24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాజా నగరంతో సహా లక్షలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలపై ప్రణాళికాబద్ధమైన దాడి గురించి చర్చించడానికి అన్నారు. “మేము వారిని బయటకు నెట్టడం లేదు, వారిని వదిలి వెళ్ళడానికి అనుమతిస్తున్నాము.”

కాల్పుల విరమణ చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు
గత నెలలో విఫలమైన తర్వాత కాల్పుల విరమణ చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు తిరిగి ప్రారంభమయ్యాయి. హమాస్ అధికారి తాహెర్ అల్-నౌనౌ ప్రకారం, హమాస్, ఈజిప్టు అధికారులు బుధవారం కైరోలో సమావేశమయ్యారు. కాగా, ఇజ్రాయెల్ తన చర్చల బృందాన్ని కైరో చర్చలకు పంపే ప్రణాళికలు లేవని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

హమాస్‌పై ఇజ్రాయెల్‌ తన సైనిక దాడిని గాజాలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఇజ్రాయెల్ ప్రణాళికలు స్వదేశంలో, విదేశాలలో అనేకమంది ఖండించారు.

2023 అక్టోబర్ 7న జరిగిన దాడిలో చిక్కిన 50 మంది బందీలు ఇప్పటికే హమాస్‌ వద్ద ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది బతికే ఉన్నారని ఇజ్రాయెల్ నమ్ముతుంది. కొత్త దాడి తమకు ప్రమాదం కలిగిస్తుందని కుటుంబాలు భయపడుతున్నాయి.

ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టి విలేకరులతో మాట్లాడుతూ, కైరో ఇప్పటికీ 60 రోజుల ప్రారంభ కాల్పుల విరమణ, కొంతమంది బందీలను విడుదల చేయడం, శాశ్వత కాల్పుల విరమణపై తదుపరి చర్చలకు ముందు మానవతా సహాయం అందించడం కోసం మునుపటి ప్రతిపాదనను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

ఇజ్రాయెల్ ఖైదు చేసిన పాలస్తీనియన్ల విడుదల, శాశ్వత కాల్పుల విరమణ, గాజా నుండి ఇజ్రాయెల్ ఉపసంహరణకు ప్రతిగా మిగిలిన బందీలను మాత్రమే విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. ఉగ్రవాద సంస్థ నిరాయుధీకరణకు నిరాకరించింది.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.