హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. వారందరికీ ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్లో ఇంటర్ విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ను పొందుపరిచినట్లు కేటీఆర్ తెలిపారు. ఇంటర్ మెటీరియల్తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే తన హామీని నెరవేర్చుకునే సమయం ఆసన్నం కావడంతో సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్ను తానే స్వయంగా పంపిణీ చేస్తానని కేటీఆర్ తెలిపారు.
ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి తన వ్యక్తిగత హోదాలో విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
https://twitter.com/KTRTRS/status/1571694291566882816?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1571694291566882816%7Ctwgr%5E14b523bb320af19274c524d7a8fd8e69382b5e6f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelanganatoday.com%2Fkt-rama-rao-to-distribute-tabs-to-government-college-students
“గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్లో భాగంగా ఈ సంవత్సరం నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు సాఫ్ట్వేర్ మరియు కోచింగ్ మెటీరియల్తో కూడిన బైజు పవర్డ్ టాబ్లెట్లను వ్యక్తిగతంగా పంపిణీ చేస్తాను. పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ పొందేందుకు విద్యార్థులకు అదనపు మెటీరియల్తో ఇది తోడ్పడుతుంది’ అని కెటి రామారావు ట్వీట్ చేశారు.
గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో మంత్రి ఆరు అంబులెన్స్లను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు 120 అంబులెన్స్లను పంపిణీ చేశారు.
https://twitter.com/KTRTRS/status/1551200049886928897?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1551200049886928897%7Ctwgr%5E14b523bb320af19274c524d7a8fd8e69382b5e6f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelanganatoday.com%2Fkt-rama-rao-to-distribute-tabs-to-government-college-students