హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుండి బయటపడి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వేగమందుకుంటోంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్.. కొవిడ్, లాక్డౌన్ సమయంలో కొద్దిగా ప్రభావితమైంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో బాగా మార్పు కనిపిస్తోంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్లో రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్ 50,000 మార్కును దాటింది. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి నాలుగు జిల్లాలతో కూడిన హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ సంవత్సరం ప్రారంభం నుండి 50,953 రెసిడెన్షియల్ యూనిట్లను విక్రయించింది. దీని మొత్తం విలువ రూ.25,094 కోట్లు.
రియల్టీలో పెట్టుబడులకు హైదరాబాద్ ఉత్తమం
నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా అంచనాలో, హైదరాబాద్ సెప్టెంబర్ 2022లో 4,307 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలను నమోదు చేసింది. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 2,198 కోట్లు.
ధర కేటగిరీ పరంగా, రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల ధర గల రెసిడెన్షియల్ యూనిట్లు సెప్టెంబర్ 2022లో జరిగిన మొత్తం అమ్మకాలలో 55 శాతంగా ఉన్నాయి, ఇది సెప్టెంబర్ 2021లో 39 శాతం వాటాతో పోలిస్తే పెరిగిం రూ. 25 లక్షల కంటే తక్కువ రేంజ్లో ఏడాది క్రితం 36 శాతంతో పోలిస్తే 16 శాతం వాటాతో బలహీనపడింది.
నివాసగృహాలు అత్యంత ఖరీదుగా మారిన నగరాల్లో బాంబే నంబర్ వన్ కాగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఢిల్లీ నిలబడింది. తరువాతి స్థానాలు వరుసగా బెంగళూరు, పుణె, చెన్నై, కోల్కతా ఉన్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కూడా నైట్ఫ్రాంక్ పేర్కొంది. కొవిడ్ తరువాత స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుందని అంచనా వేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ. 25,094 కోట్ల విలువైన 50,953 గృహ యూనిట్లు అమ్ముడుపోగా… గత ఏడాది ఇదే కాలంలో రూ.27,640 కోట్ల విలువైన 62,052 గృహ యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.2,546 కోట్ల విలువైన 11,099 యూనిట్లు తగ్గాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో తమకు ఇష్టమైన ఇంటి కోసం వేచి ఉండకుండా … అందుబాటులో ఉన్న ఇంటిని కొనేందుకే యజమానులు ఇష్టపడుతున్నట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
జిల్లా స్థాయిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల విక్రయాల రిజిస్ట్రేషన్లు 43 శాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 41 శాతం నమోదయ్యాయని అధ్యయనంలో తేలింది. ఈ నెలలో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 15 శాతంగా నమోదైంది.
రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు సెప్టెంబర్ 2022లో సంవత్సరానికి 15 శాతం పెరిగాయి. మేడ్చల్-మల్కాగిరి జిల్లాలో సెప్టెంబర్ 2022లో అత్యధికంగా 21 శాతం పెరుగుదల కనిపించింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, “మహమ్మారి సమయంలో చాలా వరకు స్థబ్దుగా ఉన్న హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2022లో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. పెరుగుతున్న గృహ నిర్మాణం కారణంగా కార్యకలాపాలు స్వల్పకాలిక తగ్గింపును మేము అంచనా వేస్తున్నాము. రుణ రేట్లు, హైదరాబాద్లో సాధారణ ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న ఆదాయ స్థాయిలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ డిమాండ్ ప్రస్తుతం మధ్యస్థంగా ఉన్న దీర్ఘకాలంలో బాగా బలపడుతుందని అంచనా వేశారు.