Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉత్తరాఖండ్‌లో ‘మదరసాలు’, మసీదులకు సీలు… రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించిన ముస్లింలు!

Share It:

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ముస్లిం వ్యతిరేక ప్రచారం పవిత్ర రంజాన్ మాసంలోనూ కొనసాగుతోంది. ఇటీవల, డెహ్రాడూన్ జిల్లాలోని అనేక మదర్సాలు, ఒక మసీదుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా, అనేక మదర్సాలను సీలు చేశారు. ఇతర మదర్సాలకు నోటీసులు జారీ చేశారు, దీంతో స్థానిక ముస్లిం సమాజం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. .

ప్రభుత్వం చేపట్టిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యలను నిరసిస్తూ మార్చి 4న డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ముస్లింలు నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జమ్మియత్-ఉలేమా-ఇ హింద్, ముస్లిం సేవా సంఘటన్ నిర్వహించాయి. దీంతో నిరసనకారుల్లో చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి ధామి సూచనల మేరకు, స్థానిక అధికారులు వికాస్‌నగర్ తహసీల్‌లోని ధక్రానీ, నవాబ్‌గఢ్‌ ప్రాంతంలోని గ్రామాలు, డెహ్రాడూన్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో మదర్సాలపై చర్యలు ప్రారంభించింది. ఐదు మదర్సాలను సీజ్ చేశారు, మరో ఆరుగురికి నోటీసులు పంపారు. అంతేకాదు ధక్రానీలోని ఒక మసీదును కూడా సీజ్ చేశారు.

సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) వినోద్ కుమార్ నేతృత్వంలోని స్థానిక అధికారులు, ముస్సోరీ డెహ్రాడూన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MDDA), రాష్ట్ర మదర్సా బోర్డుతో కూడిన బృందం మార్చి 1 నుండి వికాస్‌నగర్ ప్రాంతంలోని మదర్సాలపై దాడులు నిర్వహిస్తోంది. ఈ చర్య ముస్లిం సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

రాష్ట్ర మదర్సా బోర్డులో నమోదు కాని లేదా అధికారుల నుండి సరైన భవన అనుమతులు లేని మదర్సాలపై చర్యలు తీసుకున్నట్లు SDM కుమార్ వివరించారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న మదర్సాలు చర్యలు ఎదుర్కొంటాయని ముఖ్యమంత్రి ధామి గతంలో పేర్కొన్నారు. అయితే, ముస్లిం సేవా సంఘటన్ అధ్యక్షుడు నయీమ్ ఖురైషీ వంటి స్థానిక ముస్లిం నాయకులు ప్రభుత్వ చర్యలు అన్యాయమని వాదించారు, ప్రత్యేకించి ముందస్తు నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు.

ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు అనుమతిలేని మదర్సాలను సీల్ చేయడం చట్టవిరుద్ధమని ఖురైషీ వాదించారు. ఈ సంస్థలు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, ట్రస్టుల కింద చట్టబద్ధంగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, మదర్సాలను సీల్ చేయడానికి ఎటువంటి అధికారిక చట్టపరమైన ఉత్తర్వులు జారీ చేయలేదని, స్థానిక పాలనా బాధ్యతను ముస్సోరీ డెహ్రాడూన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MDDA)కి మార్చడానికి ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. మార్చి 5న MDDAకు వ్యతిరేకంగా మరిన్ని నిరసనలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

2017లో BJP ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రస్తుత చర్యల వరకు వారి ఎజెండాలో భాగం. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ముస్లింలను, వారి సంస్థలను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నాయి, 2021 నుండి ముఖ్యమంత్రి ధామి “లవ్ జిహాద్”, “ల్యాండ్ జిహాద్”, “మజార్ జిహాద్”, “థూక్ జిహాద్” అంటూ… వాటికి వ్యతిరేకంగా ప్రచారాలలో ముందంజలో ఉన్నారు.

మదరసాలపై అణిచివేతతో పాటు, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఇతర సంఘటనలు కూడా ఉత్తరాఖండ్‌లో జరిగాయి. ఇటీవల, రైట్‌వింగ్‌ సంస్థ అయిన హిందూ రక్షక్ దళ్, డెహ్రాడూన్ జామా మసీదు వెలుపల హనుమాన్ చాలీసాను బహిరంగంగా పఠించడానికి ప్రయత్నించింది, మసీదులో ఇచ్చే అజాన్‌ ప్రజలను కలవరపెడుతోందని పేర్కొంది. పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేశారు, కానీ అరెస్టులు జరగలేదు.

దోయివాలా సమీపంలోని నాథువాలాలో హిందూ కాళీ సేన సభ్యులు ఈవ్-టీజింగ్ ఆరోపణలపై ముస్లిం వ్యాపారిని బెదిరించి… అతని దుకాణం బిల్‌బోర్డ్‌లను ధ్వంసం చేసిన ఘటనలు లేకపోలేదు. దీంతో ఈ ప్రాంతంలోని అనేక ముస్లిం కుటుంబాలు భయంతో పారిపోయాయని తెలుస్తోంది.

మరో సంఘటనలో, 1989 నుండి ప్రతీక్ నగర్‌లోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న రాయ్‌వాలాలోని ముస్లింలను అక్కడ నమాజులు ఆపమని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. ప్రార్థన చేయడానికి వారికున్న రాజ్యాంగ హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)కి తెలియజేసినప్పటికీ, అధికారులు ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టడానికి చర్య తీసుకోలేదు.

2017 నుండి, ఉత్తరాఖండ్ బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని మదర్సాలపై సర్వేలు నిర్వహించాలని పదే పదే ప్రణాళికలు ప్రకటించింది, అయితే ఈ సర్వేల ఫలితాలు ఎప్పుడూ బహిరంగపరచలేదు. ముస్లిం సమాజం ఈ చర్యలను తమను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశపూర్వక ప్రచారంలో భాగంగా చూస్తుంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ముస్లిం వ్యతిరేక చర్యల్లో పారదర్శకత లేకపోవడం, నిరంతర బెదిరింపులు ముస్లిం సమాజాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టాయని భావిస్తున్నారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.