Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మైనారిటీల కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ఏర్పాటు చేయనున్న తెలంగాణ!

హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణపై ప్రధానంగా దృష్టి సారించి, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసే ప్రణాళికలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, విద్యను కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం చేయకుండా, విద్యార్థుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే శిక్షణను వారికి అందించాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలకు సమానంగా, ప్రతిభావంతులైన మైనారిటీ […]
Read more

పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ను ఒకే బోర్డు పరిధిలోకి తీసుకురానున్న తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యను ఒకే బోర్డు పరిధిలోకి తీసుకువస్తూ, జాతీయ విద్యా విధానానికి (NEP) అనుగుణంగా 12వ తరగతి వరకు సమగ్ర విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ విలీనం రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది. డిసెంబర్ 2025లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’లో పేర్కొన్న ప్రకారం, ఈ కొత్త బోర్డుకు […]
Read more

భూ వివాదాల పరిష్కారానికి అదనపు తహసీల్దార్లను నియమించనున్న తెలంగాణ!

హైదరాబాద్: లక్షకు మించిన జనాభా ఉన్న మండలాల్లో భూ వివాదాల పరిష్కారానికి వీలుగా ప్రభుత్వం అదనపు తహసీల్దార్లను నియమించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్వపు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు, గృహ నిర్మాణ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీనివాసరెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల కోసం ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోందని చెప్పారు. ఈ కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఉండేలా […]
Read more

మత్తుపదార్థాల నిర్మూలనకు యావత్ పోలీసు బలగం సహకరించాలి: తెలంగాణ డీజీపీ

హైదరాబాద్: రాష్ట్రంలో మత్తుపదార్థాల బెడదను నిర్మూలించడానికి యావత్ పోలీసు బలగం సహకరించాలని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ చెప్పారు. రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక ఈగిల్ ఫోర్స్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) పనితీరును ఇక్కడ సమీక్షించిన డీజీపీ, తెలంగాణలో మత్తుపదార్థాల సరఫరాను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారని చెప్పినట్లు ఆయనను ఉటంకిస్తూ ఒక అధికారిక ప్రకటన తెలిపింది. తెలంగాణలోనే కాకుండా […]
Read more

హైదరాబాద్ ORR పరిధిలో భారీగా పెరగనున్న భూముల ధరలు!

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని భూముల మార్కెట్ విలువను ప్రస్తుత ధరల కంటే కనీసం 50 శాతం మేర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ ప్రాంతంలోని భూముల ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉంది. భూముల మార్కెట్ విలువ పెంపునకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ కొత్త ధరలు మే 26 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, భూ రిజిస్ట్రేషన్లు, స్టాంపు […]
Read more

అకాల వర్షాలు, పెనుగాలులతో నల్గొండకు తీవ్ర నష్టం!

హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న తెల్లవారుజామున గాలులు, వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, భారీగా వరి పంట దెబ్బతింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో, రైతులు ఆరబెట్టుకున్న వరి… వర్షం కారణంగా తడిసిపోయింది. అదేవిధంగా, తిరుమలగిరిలోని ఐకేపీ కేంద్రాలు, కేతెపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి కూడా తడిసి ముద్దయింది. బలమైన గాలుల వల్ల పలు గ్రామాల్లో చెట్లు కూలిపోగా, మామిడి, నిమ్మ, ఇతర పంటలు తీవ్రంగా […]
Read more

ఎకరాకు రూ.40 లక్షల పరిహారం కోరుతున్న రైతులు!

హైదరాబాద్: హుజూర్‌నగర్ మండలంలో ప్రతిపాదిత ఫుడ్ పార్క్ కోసం సేకరిస్తున్న భూమికి పరిహారాన్ని పెంచాలని రైతులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈమరకు మంత్రికి రాసిన బహిరంగ లేఖలో, సర్వే నెం. 1041లోని 138 ఎకరాల భూమికి ప్రకటించిన పరిహారం ప్రస్తుత మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా ఉందని సంఘం పేర్కొంది. జీవనోపాధి నష్టం, దీర్ఘకాలిక ఆర్థిక అభద్రతను ప్రస్తావిస్తూ, ఎకరాకు కనీసం రూ.40 […]
Read more

ఈసీ విశ్వసనీయతను కోల్పోతోంది…ఎస్ఐఆర్‌ను నిలిపివేయండి!

హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియ మూడవ దశ నిర్వహించిన రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది పౌర సమాజ సభ్యులు, సమగ్ర సమీక్ష,సవరణలు జరిగే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన కనీసం 11 మందితో సహా ఈ పౌర సమాజ సభ్యులు, ఎస్ఐఆర్ ను “వివక్షాపూరితమైన, అప్రజాస్వామికమైన, పారదర్శకత లేని, అశాస్త్రీయమైన ప్రక్రియ”గా అభివర్ణించారు. దీని ఫలితంగా 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత […]
Read more

మరణించిన గిగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ!

హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు గిగ్,ప్లాట్‌ఫామ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. దీంతో, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీల నుండి రూ. 10 లక్షలతో కలిపి, ప్రతి మృతుని కుటుంబానికి అందిన మొత్తం చెల్లింపు రూ. 15 లక్షలకు చేరింది. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ఈమేరకు స్విగ్గీ డెలివరీ కార్మికుడు అహ్మద్ […]
Read more

వృత్తి విద్యా వ్యవస్థ బలోపేతానికి ఫిన్లాండ్ వైపు చూస్తున్న తెలంగాణ!

హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి విద్యా (Vocational Education) వ్యవస్థను బలోపేతం చేయడానికి… ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ మోడల్‌ను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 28 మంది ఉపాధ్యాయులు, 12 మంది అధికారులతో కూడిన 40 మంది సభ్యుల తెలంగాణ విద్యా ప్రతినిధి బృందం, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ‘ఉపాధ్యాయుల అనుభవ, విద్యా మార్పిడి కార్యక్రమం’ అనంతరం ఫిన్లాండ్ నుంచి తిరిగి వచ్చింది. ప్రభుత్వ […]
Read more
1 2 3 46

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.