Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హిందీపై కేంద్రం-తమినాడు మధ్య మాటల మంటలు!

Share It:

న్యూఢిల్లీ : హిందీ భాషా వివాదం కేంద్రం-తమిళనాడు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రం పేరుతో కేంద్రం బలవంతంగా హిందీని రుద్దుతోందని డీఎంకే ఆరోపించగా, తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం ప్రత్యారోపణ చేసింది.

ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన నోరును అదుపులో పెట్టుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తనను తాను రాజుగా భావించి అహంకారంతో మాట్లాడే కేంద్ర విద్యా మంత్రి క్రమశిక్షణతో ఉండాలి!” అని స్టాలిన్ అన్నారు. ఆయన తమిళనాడు ప్రజలను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఇందుకు అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు.

కాగా, త్రిభాషా విధానంపై డీఎంకే వైఖరిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో తప్పుపట్టారు. తమిళనాడు విద్యార్థుల సంక్షేమం పట్ల డీఎంకేకు నిజాయితీ లోపించిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును వారు నాశనం చేస్తున్నారని అన్నారు. ”భాషాపరమైన అవరోధాలు కల్పించడం ఒక్కటే వారి పని. వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. రాద్ధాంతం చేస్తున్నారు. అది అప్రజాస్వామికం, అనాగరికం” అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉపయోగించిన మాటలపై డీఎంకే సభ్యులు అభ్యంతరం చెప్పగా స్పీకర్‌ వాటిని రికార్డుల నుంచి తొలగించారు. డీఎంకే సభ్యురాలు కనిమొళి.. మంత్రి ప్రధాన్‌పై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడుతామంటూ స్పీకర్‌కు నోటీసు అందజేశారు. కాగా, కేంద్రమంత్రి ప్రధాన్‌ వైఖరికి నిరసనగా డీఎంకే ఎంపీలు పార్లమెంటు బయట నిరసన తెలిపారు. తమిళనాడులో కూడా పలు చోట్ల నిరసనలు తెలిపారు.

మరోవంక కేంద్రమంత్రి ప్రధాన్ మాట్లాడుతూ… వాస్తవానికి, తమిళనాడు మూడు భాషా సూత్రంతో సహా కొత్త విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయడానికి అంగీకరించింది, కానీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి భావోద్వేగంతో కూడిన సమస్యను ఉపయోగించుకోవాలనే ఆశతో వెనక్కి తగ్గింది.

2021 అసెంబ్లీ మరియు 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికలలో ఆధిపత్యం చెలాయించిన డిఎంకెలో “అంతర్గత కలహాలు” ఈ ప్రతిష్టంభనకు దారితీశాయని కూడా మంత్రి ప్రధాన్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు లోక్‌సభలో గొడవకు దారితీశాయి, 30 నిమిషాలు వాయిదా వేశారు. డిఎంకె ఎంపీలు పార్లమెంటు భవనం వెలుపల ఆయన వ్యాఖ్యకు వ్యతిరేకంగా నిరసన కొనసాగించారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.