న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేక హింసపై జమాతే-ఇ-ఇస్లామీ హింద్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఇళ్ళు, మదర్సాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి బుల్డోజర్లను వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు.
“మూక దాడులకు పాల్పడటం అన్యాయం”: JIH
అలీఘర్లో నలుగురు ముస్లిం మాంసం వ్యాపారులపై జరిగిన దారుణమైన దాడిని జేఐహెచ్ ఉపాధ్యక్షుడు మాలిక్ మోహతసిమ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. “కోపంగా ఉన్న ఒక గుంపు ఈ వ్యక్తులను అడ్డగించి, వారి బట్టలు విప్పి, బెల్టులు, కర్రలతో కనికరం లేకుండా కొట్టింది, వారిని రక్తసిక్తం చేసి, గాయపరిచింది” అని ఎం.ఎం.ఖాన్ అన్నారు.
జేఐహెచ్ ఉపాధ్యక్షుడు ఇంకా మాట్లాడుతూ… పోలీసులు దాడి చేసిన వారిపై, బాధితులపై గోవధ చట్టం కింద కేసులు నమోదు చేయడం మరింత దిగ్భ్రాంతికరమైన విషయం. “ఇది పూర్తిగా తప్పిదం. ఇది బాధితులను తమపై దాడి చేసిన వారితో సమానం చేస్తుందని ఆయన అన్నారు.
కర్ణాటకలోని బంట్వాల్లో అబ్దుల్ రహిమాన్ను కొట్టి చంపడం, మంగళూరులో అష్రఫ్ను హిందూ తీవ్రవాదులు దారుణంగా హత్య చేయడం, నాగ్పూర్లో మత ఘర్షణలు, మిగతా రాష్ట్రాల్లో కాశ్మీరీ ముస్లింలను వేధించడం వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ద్వేషపూరిత నేరాలను కలతపెట్టే నమూనాగా ఆయన అభివర్ణించారు.
” ఈ సంఘటనలు మన దేశ మనస్సాక్షికి మచ్చ, భారతదేశ ఐక్యత, భద్రతకు ప్రత్యక్ష ముప్పు” అని జేఐహెచ్ ఉపాధ్యక్షుడు హెచ్చరించారు. మూక హత్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు 2018 ఆదేశాలు జారీ చేసినప్పటికీ చట్ట అమలు కావడంలేదని ఆయన విమర్శించారు. ఫలితంగా నేరస్థులు ఇకపై పోలీసులకు లేదా కోర్టులకు భయపడరు.”
భారతీయ న్యాయ సంహిత, 2023 కింద లించింగ్ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేయాలని JIH పునరుద్ఘాటించింది, భవిష్యత్తులో జరిగే నేరాలను అరికట్టడానికి జీవిత ఖైదు లేదా మరణశిక్షతో సహా ఆదర్శప్రాయమైన శిక్షలను విధించాలని డిమాండ్ చేసింది.
మైనారిటీలను రక్షించడానికి మరియు న్యాయంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని మలిక్ మొహతసిమ్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. “ముస్లింలను నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఆయన అన్నారు.”
“బుల్డోజర్లు సామూహిక శిక్షకు ఆయుధాలుగా మారాయి”
ముస్లిం వర్గాలను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ కూల్చివేతలు పెరుగుతున్న ధోరణిపై కూడా మాలిక్ మోతాసిమ్ ఖాన్ మరియు ప్రొఫెసర్ సలీం ఇద్దరూ ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించారు.
ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్, శ్రావస్తి వంటి సరిహద్దు జిల్లాలకు ఇటీవల జరిగిన నిజనిర్ధారణ మిషన్ సేకరించిన విషయాలను మోతాసిమ్ ఖాన్ ఉదహరించారు, అక్కడ అన్ని అనుమతులు ఉన్న మదర్సాలు నోటీసు లేకుండా సీలు వేశారు. లేదంటే కూల్చివేశారు. “ప్రభుత్వ డేటా ప్రకారం, 300 కి పైగా ముస్లిం ప్రార్థనా స్థలాలు, మదర్సాలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ధ్వంసం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని జేఐహెచ్ నేతలు అన్నారు.”
విచారణ, చట్టపరమైన ప్రక్రియ, హెచ్చరిక లేకుండా బుల్డోజర్లను ఉపయోగించడం వల్ల పోలీసులు, స్థానిక ప్రభుత్వం, న్యాయమూర్తి, జ్యూరీ నిర్వీర్యంగా మారాయని వారన్నారు. సుప్రీంకోర్టు పరిశీలనను ఉటంకిస్తూ…”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి చెందినందున ఆస్తులను కూల్చివేయలేము అని అధికారులకు గుర్తు చేశారు.”
ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మే 20న చందోలా సరస్సు సమీపంలోని అహ్మదాబాద్లోని షా ఆలం ప్రాంతంలో 8,500 ముస్లిం ఇళ్లను కూల్చివేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అక్కడ ఆయన ఇటీవల బాధితులను కలిశారు. ఎలాంటి విచారణలు లేకుండా ప్రత్యామ్నాయాలు చూపకుండా “35 నుండి 40 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న 40,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయుల్ని చేశారని ఆయన అన్నారు.
“ఇది పట్టణాభివృద్ధి కాదు; ఇది ‘శాంతిభద్రతలు’ ‘అక్రమ నిర్మాణం’ అనే ముసుగులో ఒక వ్యవస్థాగత లక్ష్యమని ప్రొఫెసర్ సలీం అన్నారు.” మత హింస తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం గృహాలను, సంస్థలను ఎంపిక చేసి కూల్చివేస్తున్నాయని, “ఇవి కేవలం కూల్చివేతలు కాదు—ఇవి బెదిరింపు చర్యలు అని ఆయన ఆరోపించారు. .”
ఇజ్రాయెల్ గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన జేఐహెచ్:
విలేకరుల సమావేశం అంతర్జాతీయ పరిణామాలను కూడా ప్రస్తావించింది. “’ఆపరేషన్ గిడియాన్ చారియట్స్’ (బైబిల్ సూచన) అనే శీర్షికతో” గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడిని ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని “రియల్ టైమ్లో జాతి విధ్వంసం” అని ఆయన అభివర్ణించారు. “దాదాపు 18,000 మంది పిల్లలతో సహా 53,000 మంది పాలస్తీనియన్లు చంపేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా బాంబు దాడి జరుగుతోంది. సహాయ పంపిణీ కేంద్రాలు మారణహోమ ప్రాంతాలుగా మారాయి.”
సహాయాన్ని అడ్డుకోవడం, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం మరియు గాజాలోని 2.3 మిలియన్ల నివాసితులను కరువు అంచుకు నెట్టడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. “ఇది పౌర మౌలిక సదుపాయాలను క్రమబద్ధంగా నాశనం చేయడం. ఇది కేవలం దురాక్రమణ కాదు – ఇది జాతి నిర్మూలన అని జేఐహెచ్ నేత అభిప్రాయపడ్డారు.
ప్రొఫెసర్ సలీం అమెరికాను కూడా విమర్శించారు. అంతర్జాతీయ సమాజం మౌనాన్ని సైతం ఆయన విమర్శించారు. వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ, దిగ్బంధనను ఎత్తివేయడం, పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించాలని జేఐహెచ్ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. .”
భారత ప్రభుత్వం కేవలం ప్రకటనలు జారీ చేయకుండా, సూత్రప్రాయమైన వైఖరిని తీసుకోవాలని ఆయన కోరారు. “భారతదేశం దౌత్యపరమైన పిరికితనానికి అతీతంగా ఎదగాలి. ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఆపడానికి నిర్దిష్ట అంతర్జాతీయ చర్యను డిమాండ్ చేయాలని ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.”