వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఇది మంచి ముందడుగని అన్నారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వర్గాలు దిగుమతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పడం గమనార్హం.
వాషింగ్టన్ DCలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ…”భారతదేశం ఇకపై రష్యా నుండి చమురు కొనుగోలు చేయబోదని నేను అర్థం చేసుకున్నాను. అదే నేను విన్నాను, అది సరైనదో కాదో నాకు తెలియదు. అది మంచి అడుగు. ఏమి జరుగుతుందో చూద్దాం అని అన్నారు.”
రష్యా నుండి ముడి చమురు, సైనిక పరికరాలను కొనుగోలు చేసినందుకు భారతదేశంపై జరిమానా విధించాలని వాషింగ్టన్ నిర్ణయించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. అంతకుముందు, ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రాయితీపై రష్యన్ చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, US విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విమర్శించారు.
కాగా, ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ పెద్ద మొత్తంలో చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. దీనిపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. మాస్కోతో వ్యాపారం చేస్తోందన్న కారణం చూపుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. భారత్పై పెనాల్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థలు నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.
#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens…" says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12
— ANI (@ANI) August 1, 2025