న్యూయార్క్: ట్రంప్ ప్రభుత్వం నుండి బహిష్కరణ కేసును ఎదుర్కొంటున్న పాలస్తీనా హక్కుల కార్యకర్త మహమూద్ ఖలీల్పై ప్రయాణ ఆంక్షలను అమెరికా ఫెడర్ న్యాయమూర్తి ఒకరు ఎత్తివేశారు. ఆయన అమెరికా అంతటా ర్యాలీలు, ఇతర సభలలో మాట్లాడటానికి అనుమతి ఇచ్చారు.
జూన్లో లూసియానా ఇమ్మిగ్రేషన్ జైలు నుండి విడుదలైన ఖలీల్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డిసి, లూసియానా, మిచిగాన్లకు ప్రయాణించడం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఫెడరల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తిని కోరారు.
ఈమేరకు గురువారం జరిగిన వర్చువల్ విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది అలీనా దాస్ మాట్లాడుతూ… “ఈ కేసు ముఖ్యమైన మొదటి సవరణ కోసం ఆయన ప్రయాణించాలనుకుంటున్నారు.” “ప్రజా ప్రయోజన సమస్యలపై ఆయన మాట్లాడాలనుకుంటున్నారు.”
అయితే ప్రభుత్వ న్యాయవాది అనియెల్లో డిసిమోన్ ఈ చర్యను వ్యతిరేకించారు. కాగా, ఖలీల్ ప్రయాణానికి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి మైఖేల్ హామర్ అంగీకరించారు. అతను విమాన ప్రయాణం చేయొచ్చని, విడుదల షరతులను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. ఖలీల్ తన ప్రయాణ ప్రణాళికల గురించి US ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను ముందుగానే తెలియజేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హామర్ ఆమోదించారు.
కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన ఖలీల్ గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో మార్చి 8న ICE ఏజెంట్లు ఖలీల్ను అరెస్టు చేశారు, పాలస్తీనా అనుకూల కార్యకర్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణిచివేత చర్యలో చిక్కుకున్న మొదటి క్యాంపస్ స్టూడెంట్గా నిలిచాడు. అతను చట్టబద్ధమైన US శాశ్వత నివాసి.
తన మొదటి బిడ్డ జన్మించాక, జూన్లో ప్రత్యేక ఫెడరల్ న్యాయమూర్తి అతన్ని ఇమ్మిగ్రేషన్ జైలు నుండి విడుదల చేశారు.
గత నెలలో, లూసియానాలోని ఒక ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఖలీల్ తన గ్రీన్ కార్డ్ దరఖాస్తుపై సమాచారాన్ని వెల్లడించడంలో విఫలమైనందుకు అతన్ని బహిష్కరించవచ్చని తీర్పు ఇచ్చారు. అతని న్యాయవాదులు ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు.


