వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తే భారత్ ‘భారీ సుంకాలు’ చెల్లించాల్సి రావచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరోవంక న్యూఢిల్లీ మాస్కో నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపకపోతే భారత్ ‘భారీ సుంకాలు చెల్లించాల్సిందేనని, “వారు (భారతదేశం) అలా చేయకూడదని” అన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారతదేశం ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ రష్యన్ ముడి చమురు సేకరణను నిలిపివేస్తుందని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్న కొన్ని గంటల తర్వాత, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తన శక్తి వనరులను “విస్తృతంగా , వైవిధ్యభరితంగా” మారుస్తున్నట్లు భారతదేశం గత వారం తెలిపింది. భారతదేశం అలాంటి వ్యాఖ్యలు చేసిందని తాను నమ్మడం లేదని ట్రంప్ అన్నారు.
నేను భారత ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడాను, అతను రష్యా చమురు పనిని చేయబోనని చెప్పాడు” అని అమెరికా అధ్యక్షుడు జోడించారు. రష్యా ముడి చమురు కొనుగోలు ద్వారా యుద్ధానికి ఆర్థిక సహాయం చేయడానికి పుతిన్కు భారతదేశం సహాయం చేస్తోందని వాషింగ్టన్ వాదిస్తోంది.
ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన తర్వాత న్యూఢిల్లీ -వాషింగ్టన్ మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి, ఇందులో భారతదేశం రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. కాగా, అమెరికా విధించిన టారిఫ్లు “అన్యాయం, అసమంజసమని భారతదేశం అభివర్ణించింది.


