హైదరాబాద్: నగరశివార్లలోని ఫామ్హౌస్లపై హైదరాబాద్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ముడిమ్యాల్, టోల్కట్టా గ్రామాల్లోని 39 ఫామ్హౌస్లపై దాడులు నిర్వహించి, మద్యం, హుక్కా వినియోగంతో సహా అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు కనుగొన్నారు.
టోల్కట్టా గ్రామంలో పోలీసులు అజీముద్దీన్ ఫామ్హౌస్పై దాడి చేసి, అక్రమంగా హుక్కా సేవిస్తున్నట్లు గుర్తించారు. ప్రణవ విల్లా హిల్స్లో ఒక విస్కీతో సహా 18 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఫామ్ హౌస్లలో జరుగుతున్న ఒక అనధికార కార్యక్రమాన్ని పోలీసులు ఛేదించారు, అక్కడ 29 మంది వ్యక్తులు బిగ్గరగా సంగీతం ప్లే చేస్తూ…బాణసంచా మోగిస్తూ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. వీరికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు, కానీ ఎవరికీ పాజిటివ్గా తేలలేదని అధికారులు తెలిపారు.
ముడిమ్యాల్ గ్రామంలోని రితికా ఫామ్హౌస్లో మరో అనధికార కార్యక్రమంపై పోలీసుల దాడి జరిగింది. ఈ కార్యక్రమానికి పది పాఠశాల బస్సుల్లో తీసుకెళ్లిన స్లేట్ స్కూల్ పిల్లల 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. కొంతమంది సభ్యులు మద్యం సేవించారని పోలీసులు తెలిపారు.
ఇక ఫార్మ్ హౌస్ చెకింగ్ అనంతరం టోల్ కట్ట విలేజ్ వద్ద డ్రంక్ ఎండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 120 ఫోర్ వీలర్లు, 30 త్రీ వీలర్లు, 15 ద్విచక్ర వాహనాలపై మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారిపై తనిఖీలు నిర్వహించారు. మూడు వాహనాలపై కేసు నమోదు చేసి రూ. 30,000 జరిమానా విధించారు. ఉల్లంఘనలకు సంబంధించి నిర్వాహకులు, ఫామ్హౌస్ యజమానులపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.
ఫామ్హౌస్లలో మద్యం సరఫరా చేయాలంటే నిర్వాహకులు ముందస్తు అనుమతి పొందాలని, అవసరమైన ఎక్సైజ్ అనుమతులు తీసుకోవాలని హెచ్చరించారు. ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


