హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవాలని, పోలింగ్ రోజున చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఓటరు తమ ఓటు వేసే ముందు గుర్తింపు కోసం పోలింగ్ స్టేషన్లో తమ ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC)ని తప్పనిసరిగా చూపించాలని ఒక ప్రకటనలో తెలిపింది. EPICలో స్పెల్లింగ్ లోపాలు లేదా ఇతర చిన్న తప్పులు ఉంటే, ఓటరు గుర్తింపు స్పష్టంగా నిర్ధారిస్తే… వాటిని విస్మరిస్తారు.
EPIC లేని వారు ID రుజువుగా ఈ క్రింది పత్రాలను సమర్పించవచ్చు.
ఆధార్ కార్డ్
MGNREGA జాబ్ కార్డ్
బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోగ్రాఫ్ ఉన్న పాస్బుక్
ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ (ఆయుష్మాన్ భారత్ కార్డ్తో సహా)
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డ్
NPR కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్
భారతీయ పాస్పోర్ట్
ఫోటోగ్రాఫ్ ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం, PSU లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన ఫోటోగ్రాఫ్ ఉన్న సర్వీస్ ఐడెంటిటీ కార్డ్
MPలు/MLAలు/MLCలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు
సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక వైకల్య ID (UDID) కార్డ్
అదేసమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 20A కింద నమోదు చేసుకున్న విదేశీ ఓటర్లు గుర్తింపు కోసం మాత్రమే వారి భారతీయ పాస్పోర్ట్ను సమర్పించాలి.
ఓటర్లు ఎన్నికల రోజుకు కనీసం ఐదు రోజుల ముందు పోలింగ్ వివరాలతో కూడిన ఓటరు సమాచార స్లిప్లను అందుకుంటారు. అయితే, ఈ స్లిప్లను ID రుజువుగా ఉపయోగించలేరు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వైన్ దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. ఫలితాలు 14న ప్రకటిస్తారు. ఈ ఏడాది జూన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరుపున మాగంటి సునీత, బీజేపీ దీపక్ రెడ్డిని నిలబెట్టాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్థికి అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం కూడా మద్దతు ఇస్తుంది.


