వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజాలో మోహరించనున్న ప్రతిపాదిత స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థాని అన్నారు.
వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశాల తర్వాత…ఖతార్కు చెందిన అల్ జజీరా ఛానెల్తో మాట్లాడుతూ, గాజాలో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఉల్లంఘనలు మధ్యవర్తులను “ఇబ్బందికరమైన స్థితిలో” ఉంచుతాయని హెచ్చరించిందని షేక్ మొహమ్మద్ అన్నారు.
గాజా కాల్పుల విరమణ ఒప్పందం రెండవ దశను చేరుకోవడానికి “రెట్టింపు ప్రయత్నాలు” చేయడంపై రూబియోతో తాను ఏకీభవిస్తున్నానని ప్రధాన మంత్రి చెప్పారు. తదుపరి దశకు వెళ్లడానికి స్పష్టమైన ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడానికి మధ్యవర్తుల మధ్య సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.
కాంగ్రెస్ సభ్యులతో జరిగిన చర్చలలో గాజాలోని మానవతా పరిస్థితి ప్రముఖంగా చర్చకు వచ్చిందని ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ నొక్కిచెప్పారు. మానవతా సహాయం బేషరతుగా ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించాలనే ఖతార్ డిమాండ్ను పునరుద్ఘాటించారు.
“గాజాలో ప్రస్తుత పరిస్థితి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేస్తుంది” అని ఆయన అన్నారు, నిరంతర ఉల్లంఘనలు కాల్పుల విరమణను పూర్తిగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
సిరియా గురించి, ఆర్థిక పునరుద్ధరణకు వీలుగా డమాస్కస్పై అమెరికా ఆంక్షలను ఎత్తివేయడానికి దోహా మద్దతు ఇస్తుందని ఖతార్ ప్రధానమంత్రి అన్నారు, “ఆంక్షల తొలగింపు తర్వాత సిరియన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఉమ్మడి ప్రయత్నాలను మొదలు పెట్టడానికి ఈ క్షణాన్ని ఒక అవకాశంగా అభివర్ణించారు. “సిరియా ప్రాదేశిక ఐక్యత కోసం ఖతార్ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.


