హైదరాబాద్: నగరంలో పబ్బులు, డీజే పార్టీల సంస్కృతి ఇటీవల భారీగా పెరిగిపోయింది. అయితే.. ఈ పబ్బులు, డీజే పార్టీల ముసుగులో వీళ్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు పలుమార్లు బయటపడింది. తాజాగా జరిగిన ఓ డీజే పార్టీలో ఎనిమిది మంది డ్రగ్స్ వినియోగదారులు పట్టుబడ్డారని తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ విభాగం – ‘EAGLE ఫోర్స్’ తెలిపింది.
విశ్వసనీయ నిఘా ఆధారంగా…ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) ఫోర్స్, సైబరాబాద్ పోలీసులతో సమన్వయంతో, డిసెంబర్ 27న ఇక్కడి ఒక నైట్ క్లబ్లో ఉక్రేనియన్ DJ ఆర్ట్బాట్ నిర్వహించిన DJ కచేరీలో పోలీసులు డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా అధునాతన పరీక్షా కిట్లను ఉపయోగించి మాదకద్రవ్యాల పరీక్ష జరిపింది.
“డ్రగ్స్ టెస్ట్ జరిపిన 14 మందిలో, ఎనిమిది మందికి పాజిటివ్గా తేలింది. వారిలో, ఐదుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా మాదకద్రవ్యాలు వినియోగించినట్లు అంగీకరించారు. ముగ్గురు మొదట మాదకద్రవ్యాల వినియోగాన్ని తిరస్కరించారు. అయితే, వేర్వేరు పరికరాలను ఉపయోగించి తిరిగి పరీక్షించిన తర్వాత, ఫలితాలు పాజిటివ్గా నిర్ధారించారు. ఎనిమిది మంది వ్యక్తులు ఇప్పటికే EAGLE ఫోర్స్ అనుమానిత జాబితాలో ఉన్నారని అది తెలిపింది.
ఈ ఎనిమిది మంది నైట్ క్లబ్ ప్రాంగణంలో కాకుండా వేరే చోట మాదకద్రవ్యాలు సేవించినట్లు అనుమానిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. పట్టుబడ్డ వినియోగదారులను, వారి తల్లిదండ్రులతో పాటు, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్కు కౌన్సెలింగ్ కోసం పిలిపిస్తారు.
“సంస్కరణ విధానంలో భాగంగా వారిని డిఅడిక్షన్, పునరావాస కేంద్రాలలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు”.


