Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ… 88 మందికి గాయాలు!

Share It:

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఒక లోకో రైలు మరో రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 88 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం బాగా పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాద సమయంలో రైలులో కార్మికులు, అధికారులు సహా మొత్తం 109 మంది ఉన్నారని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు. వీరిలో 70 మంది గాయపడిన కార్మికులు గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు.

రైలులోని వారిని సురక్షితంగా బయటకు తరలించామని, గాయపడిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. గాయపడిన వారి పరిస్థితి గురించి ఆరా తీసి, సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. THDC (ఇండియా) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులోని పిపల్‌కోటి సొరంగంలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఒక రైలు, సామాగ్రిని తీసుకెళ్తున్న మరో రైలు ప్రయాణిస్తున్నప్పుడు అవి ఢీకొన్నాయని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

“షిఫ్ట్ మార్పు సమయంలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని అలకనంద నదిపై 444 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నాలుగు టర్బైన్ల ద్వారా 111 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎప్పటిలాగే, మంగళవారం ప్రాజెక్ట్ సొరంగం లోపల పనులు జరుగుతున్నాయి. సొరంగం తవ్వడానికి బోరింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. రాత్రి 9 గంటలకు, షిఫ్ట్ మార్పు సమయంలో, లోపలి నుంచి వస్తున్న ఖాళీ రైలు బయటి నుంచి కార్మికులను తీసుకెళ్తున్న లోకో రైలును ఢీకొట్టింది.

నిర్మాణ పనుల కోసం కార్మికులు, అధికారులు, సామాగ్రి రవాణాకు సొరంగాల లోపల లోకో రైళ్లను ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. గాయపడిన 10 మందిని చికిత్స కోసం గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి పంపినట్లు చమోలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.