జెరూసలెం: గాజాలో ఇటీవలి తుఫానులు వేలాదిగా నిరాశ్రయుల టెంట్లను దెబ్బతీశాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవంక ఖాన్ యూనిస్లోని కొన్ని ప్రాంతాలలో, గాజాలో మానవతా కార్యకలాపాలకు ఇజ్రాయెల్ రోజువారీ అడ్డంకులు ఉన్నప్పటికీ కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఈమేరకు మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (OCHA)ని ఉటంకిస్తూ… UN ప్రతినిధి ఫర్హాన్ హక్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ…రోజువారీ అంతరాయాలు ఉన్నప్పటికీ అవసరమైన ప్రజలకు యూఎన్, దాని భాగస్వాములు సహాయం చేస్తూనే ఉన్నారని” అన్నారు.
“గత వారం తుఫానులు గాజా అంతటా 80 ప్రదేశాలను కూడా ప్రభావితం చేశాయని, కనీసం 4,000 కుటుంబ ఆశ్రయాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. 660 కంటే ఎక్కువ కుటుంబాలకు అత్యవసర ఆహార సామాగ్రి, టెంట్లు, టార్పాలిన్లు అందాయని ఆయన అన్నారు.
“దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతు చేయడం, మరింత భూమిని అందుబాటులో ఉంచడానికి శిథిలాలను తొలగించడం, నీరు, పారిశుద్ధ్య వ్యవస్థలను పునరుద్ధరించడం వంటి తక్షణ అవసరాన్ని” హక్ నొక్కి చెప్పారు.
మరోవంక ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను వెంటనే ఖాళీ చేయమని ఆదేశిస్తూ… “ఎల్లో లైన్ పేరిట తూర్పున ఉన్న బని సుహీలా, తూర్పు ఖాన్ యూనిస్లలో కరపత్రాలు జారవిడిచిందని, ఆయన అన్నారు. ప్రభావిత ప్రాంతంలో 400 కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయని OCHA అంచనా వేసిందని ఆయన అన్నారు.
“పౌరులు ఎల్లప్పుడూ రక్షించాలని, సురక్షితంగా పారిపోవడానికి అనుమతించాలని OCHA పునరుద్ఘాటిస్తుంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు వారు తిరిగి రావడానికి కూడా అవకాశముండాలని” UN ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు.


