టెల్అవీవ్: ఇరాన్ నిరసనలలో మరణించిన బాధితులలో ఒకరిగా జాతీయ టెలివిజన్ ప్రసారంలో తనను తాను చూసుకున్న ఇజ్రాయెల్ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నోయా జియాన్గా గుర్తింపు పొందిన ఆ మహిళ సోమవారం, ఈ విషయాన్ని జనవరి 26న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోస్ట్ చేసింది. “ఇరాన్లో నిరసనలలో యూదుల్ని చంపేశారు” అనే శీర్షికతో తన ఫోటోను ఉపయోగించి ఒక వార్తా ప్రసార ఛానెల్ను చూపించడం… మీడియా విశ్వసనీయతపై ఆందోళనలను రేకెత్తించింది.
వీడియోపై “ఇది నా 2026 బింగోలో లేదు” అనే టెక్స్ట్ ఉంది, నోయా తనను తాను టీవీలో “చనిపోయిన” వారిలో ఒకరిగా చూసి ఆశ్చర్యపోయింది.
ఇజ్రాయెల్ జాతీయురాలు ప్రకారం… ఆమె ఎప్పుడూ ఇరాన్ను సందర్శించనప్పటికీ, వార్తా ఛానల్ ఆమెను సనాజ్ జవహేరియన్గా చూపించింది, దేశవ్యాప్తంగా జరిగిన సామూహిక నిరసనల సమయంలో ఇరాన్ దళాలు అరెస్టు చేసి కొట్టి చంపాయని ఆరోపించి ‘ప్రదర్శనకారుల్లో ఒకరిగా ఆమెను పేర్కొన్నారు’.
“నా జీవితంలో నాకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు… నేను నా ఇంట్లో ఉన్నాను!” నోయా ఆశ్చర్యంగా వీడియోను చిత్రీకరిస్తూ టీవీని ఒకేసారి చూపించింది. ఆమె తన ప్రేక్షకులకు పదే పదే చెబుతూ, ముప్పై నిమిషాల్లో ‘శిక్షణ’ కోసం బయలుదేరుతున్నానని చెప్పింది.
“నేను ఇక్కడ ఉన్నాను, నేను బతికే ఉన్నాను, ఇంట్లో కూర్చున్నాను, అరగంటలో నేను శిక్షణకు వెళ్తున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ ఇరాన్కు వెళ్లలేదు,” అని ఆమె జోడించింది.
ఇరాన్లో తీవ్రతరం అయిన పరిస్థితిని చూపించడానికి ఇజ్రాయెల్ మీడియా ప్రచారం అని అనేక మంది ఆన్లైన్ వినియోగదారులు ఈ వీడియోకు ప్రతిస్పందించారు, మరికొందరు ఇది ప్రసారకుడి వైపు నుండి జరిగిన ఒక సాధారణ తప్పు అని తోసిపుచ్చారు.
ఇరాన్లో దేశవ్యాప్తంగా నిరసనలు
డిసెంబర్ 28న ఇరాన్ కరెన్సీ రియాల్ పతనంతో ఇరాన్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. త్వరగా దేశవ్యాప్తంగా వ్యాపించాయి. అసమ్మతిని సహించని ఇరాన్ మత ప్రభుత్వం నిరసనలు హింసాత్మక అణచివేసింది.
నిరసన ప్రదర్శనలు ముగిసినప్పటి నుండి కార్యకర్తల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది, రెండు వారాలకు పైగా ఇంటర్నెట్ నిషేధం ఉన్నప్పటికీ సమాచారం బయటకు వస్తుంది. కాగా, ఇరాన్ దేశవ్యాప్త నిరసనలపై అణిచివేతలో కనీసం 6,126 మంది మరణించారని,ఇంకా చాలా మంది చనిపోయారని భయపడుతున్నారని కార్యకర్తలు తెలిపారు. అయితే ఇరాన్ ప్రభుత్వం మరణాల సంఖ్యను 3,117గా పేర్కొంది, 2,427 మంది పౌరులు, మిగతా వారు భద్రతా దళాలు అని తెలిపింది.


