Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పశ్చిమాసియా యుద్ధం భారత విదేశాంగ విధానంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది…మనీష్ తివారీ!

Share It:

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం విషయంలో భారత విదేశాంగ విధాన తీరును సీనియర్ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. బలవంతపు పాలన మార్పులు, ఎంపిక చేసిన హత్యలు, సార్వభౌమ ప్రభుత్వాల అధికారుల అపహరణలపై భారతదేశం మౌనం వహించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తివారీ ప్రత్యేకంగా ఇలా ప్రశ్నించారు,

‘అధికారంలో ఉన్న రాష్ట్రపతి హత్యను భారతదేశం విమర్శించాలి కదా, అలాగే న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అమెరికా క్షిపణి దాడిలో మరణించిన 196 మంది అమాయక పాఠశాల విద్యార్థుల మృతికి సంతాపం తెలపాల్సింది కాదా?’ అయినా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటంపై కాంగ్రెస్‌ ప్రతినిధి విరుచుకుపడ్డారు.

హర్ముజ్ జలసంధి దిగ్బంధించటం, పర్షియన్ గల్ఫ్‌లో 3,000 నౌకలు నిలిచిపోవడంతో, ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, ఆహారం, నిత్యావసర మందుల సరఫరా మార్గాలకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన నొక్కి చెప్పారు. 1962, 1965, 1971 యుద్ధాల చారిత్రక ఉదాహరణలను ఉటంకిస్తూ… జాతీయ భద్రతా సంక్షోభాల సమయంలో కూడా పార్లమెంటు పూర్తి స్థాయిలో క్రియాశీలంగా పనిచేసిందని, ఈ సంక్షోభంపై పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.