న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “దిమాగీ నక్సలిజం” పట్ల దేశాన్ని హెచ్చరించిన ఒక రోజు తర్వాత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం తనను అలా పిలవటం గర్వంగా ఉందని ప్రకటించారు. ఈమేరకు Xలో పోస్ట్ చేశారు.
శనివారం ఎర్రకోట నుండి ప్రధాని మోదీ మాట్లాడుతూ, సాయుధ నక్సలిజం నిర్మూలనలో భారతదేశం సాధించిన పురోగతిని మోదీ ప్రస్తావించారు, కానీ “దిమాగీ నక్సల్” మనస్తత్వం ఇప్పటికీ ఒక ముప్పుగానే ఉందని హెచ్చరించారు. అటువంటి శక్తులు “హింస, అశాంతి”, అస్తవ్యస్తతను రెచ్చగొట్టడానికి అవకాశాల కోసం చూస్తాయని ఆయన అన్నారు. యువతను జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కోరుతూ, ఈ వ్యక్తులను “గుర్తించి, ఏకాకిని చేయాలి” అని చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ కూడా ప్రధానమంత్రిని విమర్శించారు. ఇది ఆయన నిరాశకు స్పష్టమైన సంకేతం” అని జైరాం రమేశ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ గతంలో ప్రత్యర్థులను “అర్బన్ నక్సల్స్” అని ముద్రవేసి, ఇప్పుడు “దిమాగీ నక్సల్స్” అని పిలవడం మొదలుపెట్టారని ఆయన ఎత్తి చూపారు. “మొదట ఆయన తన ప్రత్యర్థులను ‘అర్బన్ నక్సల్స్’ అన్నారు. ఇప్పుడు వారిని ‘దిమాగీ నక్సల్స్’ అంటున్నారు. ఇది ఆయన నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం,” అని రమేష్ ‘X’లో రాశారు.
‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘దిమాగీ నక్సల్స్’ అని ముద్రపడిన వారితో ఒకప్పుడు ముడిపడి ఉన్న అనేక వైఖరులను మోదీ స్వయంగా అవలంబించారని కూడా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు.

