Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మణిపూర్, కాశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్!

Share It:

జెనీవా: కశ్మీర్, మణిపూర్‌పై తన గ్లోబల్ అప్‌డేట్‌లో UN మానవ హక్కుల చీఫ్ చేసిన “నిరాధారమైన ” వ్యాఖ్యలను భారతదేశం ఖండించింది, దీనిపై ఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్‌ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి రాయబారి అరిందం బాగ్చి అన్నారు.

జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 50వ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ వోల్కర్ టర్క్ తన గ్లోబల్ అప్‌డేట్‌లో మణిపూర్, కాశ్మీర్‌ పరిస్థితిని ప్రస్తావించిన తర్వాత భారతదేశం తీవ్రంగా స్పందించింది.

“భారత ప్రజలు మా గురించి ఇటువంటి ఆందోళనలు తప్పు అని పదే పదే నిరూపించారని బాగ్చి అన్నారు. ఇందుకు బదులుగా భారతదేశ వైవిధ్యం, నాగరికతను మీరు బాగా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నామని ఆయన తెలిపారు. యూఎన్ తన గ్లోబల్ అప్‌డేట్‌లో జమ్మూ – కాశ్మీర్ గురించి ప్రస్తావించడం కంటే ఈ వైవిధ్యాన్ని మరేమీ ప్రతిబింబించదని బాగ్చి అన్నారు, దీనిని టర్క్ గ్లోబల్ అప్‌డేట్‌లో తప్పుగా “కాశ్మీర్” అని రాయడం గమనార్హం.

ఈ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్‌ నమోదు కావడం, పర్యాటక రంగంలో పెరుగుదల, వేగవంతమైన అభివృద్ధి చూడాలని అన్నారు. గ్లోబల్ అప్‌డేట్‌కు “నిజమైన అప్‌డేట్” అవసరమని బాగ్చి అన్నారు. యూఎన్‌ తన గ్లోబల్ అప్‌డేట్‌లో మణిపూర్‌, కశ్మీర్‌ గురించి నిరాధార ఆరోపణలు చేయడంపై మేము ఆందోళన చెందుతున్నామని భారత రాయబారి అన్నారు.

మణిపూర్‌లో హింస, నిరాశ్రయుల సమస్యను పరిష్కరించడానికి చర్చలు చేపట్టాలని, శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలను పెంచాలని కూడా నేను పిలుపునిస్తున్నాను” అని UN మానవ హక్కుల చీఫ్ అన్నారు.

ఇక కశ్మీర్‌లో “మానవ హక్కుల కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులపై నిర్బంధ చట్టాలను ప్రయోగించడం, వేధింపులను ఆపకపోవడం సహా ఏకపక్ష నిర్బంధాలు చేపట్టడంపై తాను ఆందోళన చెందుతున్నానని” యూఎన్‌ ప్రతినిధి అన్నారు. ప్రజాస్వామ్యం, దానిని పరిరక్షించేందుకు ఉన్న సంస్థలు భారతదేశ గొప్ప బలాలు. సమాజంలోని అన్ని స్థాయిలలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం అవసరమని UN మానవ హక్కుల చీఫ్ టర్క్ అన్నారు.

కాగా యూఎన్‌ మానవ హక్కుల చీఫ్ తన గ్లోబల్ అప్‌డేట్‌లో ఉక్రెయిన్, గాజా నుండి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ వరకు ఉన్న సంఘర్షణలు, పరిస్థితులను కవర్ చేసింది, కానీ పాకిస్తాన్‌ను మాత్రం ప్రస్తావించలేదు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.