Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పోలీసు రైడ్‌లో శిశువు మృతి…చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన జమాతే-ఇస్లామీ హింద్ బృందం!

Share It:

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రఘునాథ్‌గఢ్ గ్రామంలోని ఓ ఇంటిపై జరిగిన పోలీస్‌ రైడ్‌లో.. అధికారి నిర్లక్ష్యంతో మరణించిన 22 రోజుల పసికందు కుటుంబాన్ని జమాతే-ఇ-ఇస్లామీ హింద్ (JIH) ప్రతినిధి బృందం పరామర్శించింది. మార్చి 2న నౌగావ్ పోలీస్ స్టేషన్ బృందం నిర్వహించిన సైబర్ క్రైమ్ దాడిలో జరిగిన దారుణమైన సంఘటనలో శిశువు మరణం సంభవించింది.

నివేదికల ప్రకారం, పోలీసు బృందం తెల్లవారుజామున దాడి నిర్వహించింది. ఆపరేషన్ సమయంలో, ఒక అధికారి అనుకోకుండా శిశువు పడుకున్న మంచంపై కాలు వేసి, బూట్ల కింద నలిపి, చిన్నారి విషాదకరమైన మరణానికి కారణమైంది. ఈ సంఘటన సమాజంలో గగుర్బాటు కలిగించింది. ప్రజల్లో విస్తృతమైన భయాన్ని, భయాందోళనలను సృష్టించింది.

జేఐహెచ్‌ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్, మదాని దుఃఖిస్తున్న కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్నితెలిపారు, సాధ్యమైన మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు సమీప ప్రాంతాల నుండి వచ్చిన గ్రామస్తులతో కూడా సమావేశమై తమ సంఘీభావం, సానుభూతిని వ్యక్తం చేశారు. రాజస్థాన్ మాజీ మంత్రి నస్రుద్దీన్ కూడా అక్కడే ఉండి, జరిగిన సంఘటనల గురించి వివరించారు.

ఆ తరువాత ప్రతినిధి బృందం శిశువుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న గ్రామస్తులతో చేరింది. నిరసన సందర్భంగా, ప్రొఫెసర్ సలీం ఒక క్లుప్తంగా శక్తివంతమైన ప్రసంగం చేశారు, నిరసనకారులు న్యాయం కోసం ఐక్యంగా ఉండాలని ప్రోత్సహించారు. ఆయన కొంతమంది వ్యక్తులు తమ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను చూసి నిరుత్సాహపడొద్దని కోరారు. గతంలో, ఈ ప్రాంతంలోని ప్రజలు న్యాయం కోసం తమ పోరాటాన్ని వదులుకున్నారని, రాజీ పడ్డంతో, అణచివేతదారులను ధైర్యంతో న్యాయం కోరుకునే వారి దృఢ సంకల్పాన్ని బలహీనపరిచారని ఆయన హెచ్చరించారు. ఈ తప్పును పునరావృతం చేయవద్దని ఆయన అక్కడి స్థానికులకు పిలుపునిచ్చారు.

న్యాయవాది లియాకత్, JIH మేవాడ్‌ యూనిట్ అసిస్టెంట్ నజీమ్ ఒబైదుర్ రెహమాన్,మౌలానా తాహిర్ కూడా సందర్శన సందర్భంగా నిరసనలో పాల్గొన్నారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.