హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను సవరించింది. ఇది నిన్నటినుండి అమల్లోకి వచ్చాయి. దాదాపు 20శాతం మేర ఛార్జీలను పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేర ఛార్జీలను పెంచామని ఆర్టీసీ చెబుతోంది.
రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. .
మూడేళ్లుగా బస్ పాస్ ఛార్జీలను పెంచలేదని, బస్సుల నిర్వహణ, డీజీల్ ధరలు పెరగడం, ఉద్యోగుల జీతాల చెల్లింపు వంటి వాటితో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వాటి నుంచి బయటపడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బస్ పాస్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
బస్ పాస్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ టోల్ ఛార్జీలను 10 రూపాయలకు పెంచారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలతో ప్రతి నెల ఆర్టీసీకి సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడుతుందని అందుకే టోల్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం పేర్కొంది.
సవరించిన విద్యార్థి బస్ పాస్ ఛార్జీలు
8 కి.మీ వరకు 150 225
12 కి.మీ వరకు 200 300
18 కి.మీ వరకు 300 450
22 కి.మీ వరకు 390 585
22 కి.మీ వరకు 450 675
నెలవారీ రూట్ పాస్లు (జిల్లాలు)
10 కి.మీ వరకు 150 225
15 కి.మీ వరకు 150 375
20 కి.మీ వరకు 300 450
20 కి.మీ వరకు 400 600
25 కి.మీ వరకు 400 675
30 వరకు కి.మీ 400 750
5 కి.మీ వరకు 400 825
విద్యార్థుల జనరల్ బస్ టికెట్ (HYD/WGLలో):
SGBT (నెలవారీ) 400 600
GBT – నెలవారీ బస్ పాస్లు
GBT – ఆర్డినరీ 1150 1400
GBT – మెట్రో ఎక్స్ప్రెస్ 1300 1600
GBT – మెట్రో డీలక్స్ 1450 1800
కాగా, విద్యార్థుల ప్రయాణ సమయాల్లో రద్దీగా ఉండే సిటీ ఆర్డినరీ బస్సులలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో, TGSRTC సాధారణ సిటీ బస్సులతో పాటు హైదరాబాద్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఉపయోగించడానికి విద్యార్థులకు అనుమతిని పొడిగించింది.